హరియాణాకు చెందిన ఎమ్మెల్యేలను బెదిరింపులకు పాల్పడిన బిహార్ గ్యాంగ్ను గత నెలలో అరెస్ట్ చేసిన పోలీసులు.. వీరికి పాకిస్థాన్, పశ్చిమా ఆసియా దేశాల్లోని ముఠాలతో లింకులు ఉన్నట్టు గుర్తించారు. అంతేకాదు, గత ఎనిమిది నెలల్లో పాకిస్థాన్కు రూ.2.7 కోట్ల పంపినట్టు పోలీసులు తెలిపారు. పంజాబ్కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేల్ని కూడా ఈ గ్యాంగ్ బెదిరించింది. మొదట్లో ఈ బెదిరింపు కాల్స్ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వెనుక ఉన్న ముఠాలతో ముడిపడి ఉన్నట్టు భావించారు. కొంతమంది పంజాబీలో మాట్లాడుతూ ‘మీకు మూసేవాలాకు పట్టిన గతి తప్పదు’ అని హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి డబ్బులను దోచుకోడానికే ఇటువంటి నేరాలను పాల్పడినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. గత నెలలో అరెస్టయిన ఈ ఆరుగురు వ్యక్తులు కేవలం బెదిరింపు కాల్స్ మాత్రమే కాదు.. ‘కౌన్ బనేగా కరోడ్తి’ వంటి ప్రోగ్రామ్స్, లాటరీల పేరుతో జనాల్ని బురిడీకొట్టించి, డబ్బులు దోచుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ దందాల కోసం పేదవాళ్ల పేరుతో బ్యాంకుల్లో ఖాతాలను తెరిపించినట్టు గుర్తించారు. కనీసం ఎనిమిది నెలల్లో బిహార్లోని 727 ఖాతాలను వినియోగించారని హరియాణా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ సందీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు.
సరిహద్దులు దాటించే అవసరం లేకుండా పాకిస్థాన్లోని సహచరులకు 'హవాలా' మార్గంలో డబ్బు పంపారని వివరించారు. అయితే, వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్లేవని, కేవలం సులువుగా డబ్బు సంపాదన కోసమే ఇలా చేసినట్టు గుర్తించామని అన్నారు. ముఠాలోని దులేశ్ ఆలమ్, బద్రే అలమ్లను ముంబయిలోనూ, అమిత్ యాదవ్, సాదిఖ్ అన్వర్, సనోజ్ కుమార్, కష్ ఆలమ్లను ముజఫర్పూర్లో అరెస్ట్ చేశారు.
జూన్ 24 నుంచి 28 మధ్య గొంతులు మారుస్తూ పలు భాషలు, యాసల్లో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ముంబయి, బిహార్ పోలీసుల సహకారంతో గ్యాంగ్ను పట్టుకున్నారు.
సరిహద్దులు దాటించే అవసరం లేకుండా పాకిస్థాన్లోని సహచరులకు 'హవాలా' మార్గంలో డబ్బు పంపారని వివరించారు. అయితే, వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల్లేవని, కేవలం సులువుగా డబ్బు సంపాదన కోసమే ఇలా చేసినట్టు గుర్తించామని అన్నారు. ముఠాలోని దులేశ్ ఆలమ్, బద్రే అలమ్లను ముంబయిలోనూ, అమిత్ యాదవ్, సాదిఖ్ అన్వర్, సనోజ్ కుమార్, కష్ ఆలమ్లను ముజఫర్పూర్లో అరెస్ట్ చేశారు.
జూన్ 24 నుంచి 28 మధ్య గొంతులు మారుస్తూ పలు భాషలు, యాసల్లో ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, ముంబయి, బిహార్ పోలీసుల సహకారంతో గ్యాంగ్ను పట్టుకున్నారు.