యాప్నగరం

గంగాసాగర్ జాతర తొక్కిసలాటలో ఆరుగురు మృతి

కచుబెరియా వద్ద జరుగుతున్న గంగాసాగర్ జాతరలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా...

TNN 15 Jan 2017, 8:16 pm
పశ్చిమబెంగాల్‌లో పండగపూట విషాదం చోటుచేసుకుంది. కచుబెరియా వద్ద జరుగుతున్న గంగాసాగర్ జాతరలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. కచుబెరియా ఘాట్ వద్ద జాతరకి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు ఆదివారం సాయంత్రం 5 గంటలకి తిరిగి కోల్‌కతాకు వెళ్లే లాంచ్ ఎక్కేందుకు పోటీపడటమే ఈ తొక్కిసలాటకి కారణమైంది. ప్రమాదం జరిగిన తీరు చూస్తోంటే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది.
Samayam Telugu gangasagar fair stampede in west bengal led to 6 deaths
గంగాసాగర్ జాతర తొక్కిసలాటలో ఆరుగురు మృతి


ప్రతీ సంవత్సరం మకర సంక్రాంతి సందర్భంగా గంగాసాగర్‌లో పుణ్యస్నానం ఆచరించడం కోసం లక్షల సంఖ్యలో భక్తులు కచుబెరియాకు వస్తుంటారు. స్థానికులే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి కచుబెరియా ఘాట్ తర్వాతే గంగాసాగర్ ప్రవాహం బంగాళాఖాతంలో కలుస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.