యాప్నగరం

ఎన్‌కౌంటర్: ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్, ముగ్గురు అనుచరుల హతం

ఢిల్లీలోని మోస్ట్ వాటెంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన రాజేష్ భారతీ, అతడి ముగ్గురు అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు.

Samayam Telugu 9 Jun 2018, 3:29 pm
ఢిల్లీలోని మోస్ట్ వాటెంటెడ్ గ్యాంగ్‌స్టర్లలో ఒకడైన రాజేష్ భారతీ, అతడి ముగ్గురు అనుచరులను పోలీసులు ఎన్‌కౌంటర్లో కాల్చి చంపారు. ఛాతర్‌పూర్ ప్రాంతంలో శనివారం ఈఎన్‌కౌంటర్ జరిగింది. పక్కా సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లొంగిపోమని రాజేష్ భారతీ గ్యాంగ్‌ను హెచ్చరించారు. కానీ వారు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని తెలుస్తోంది.
Samayam Telugu police encounter


రాజేశ్ భారతీపై హత్య, దోపిడీ, కార్ల దొంగతనం సహా 25కి పైగా కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో హర్యానా పోలీస్ కస్టడీ నుంచి రాజేష్ తప్పించుకున్నాడు. చనిపోయిన నలుగురూ వాంటెడ్ జాబితాలో ఉన్నారు. ఒక్కొక్కరి తలపై లక్ష రూపాయల రివార్డ్ ఉందని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.