యాప్నగరం

రామ్మోహన్ పై వేటు: కొత్త సీఎస్ నియామకం

ఐటీ దాడులు జరిగిన 24 గంటల్లోనే రామ్మోహన్ పై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది

TNN 22 Dec 2016, 12:55 pm
తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన 24 గంటల్లోనే ప్రభుత్వం ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. అతడిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తున్నట్టు తెలిపింది. ప్రస్తుతం మాజీ సీఎస్ గా మారిన రామ్మోహన్ రావు ఇంట్లో బుధవారం జరిగిన దాడుల్లో భారీగా అక్రమస్తులు, కోట్ల కొద్దీ డబ్బు, బంగారం బయటపడ్డాయి. ఆయన కార్యాలయాలపైనా, కొడుకు ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రతి చోట అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Samayam Telugu girija vaidyanathan is the new cs of tamilnadu
రామ్మోహన్ పై వేటు: కొత్త సీఎస్ నియామకం


బుధవారం ఉదయం అయిదున్న నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరున్నర ప్రాంతం వరకు ఏకధాటిగా అధికారులు సోదాలు చేశారు. శేఖర్ రెడ్డి అరెస్టు, సీఎస్ ఇంటిపై దాడులు ఏకకాలంలో జరగడం తమిళనాడు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా మారింది. సీఎస్ రామ్మోహన్ రావు జయలలితకు, శశికళకు, పన్నీర్ సెల్వంకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు. విపక్షాలు ఈ విషయమై ప్రభుత్వంపై దాడికి దిగే ప్రమాదం ఉండడంతో సీఎం పన్నీర్ సెల్వం కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో సీఎస్ ను తప్పించాలన్న నిర్ణయానికి అందరూ మద్దతు పలికారు.

కొత్త సీఎస్ గిరిజా వైద్యనాథన్....


రామ్మోహన్ రావు 1985 సివిల్స్ బ్యాచ్ కు చెందిన వారు కాగా, కొత్తగా నియమితులైన గిరిజా వైద్యనాథన్ 1981 బ్యాచ్ అధికారి. రామ్మోహన్ ది ఏపీలోని ప్రకాశం జిల్లా. ఎకనామిక్స్ లో ఎమ్ఏ, ఎకౌంటన్నీలో ఎంకామ్ చేశారు. జయలలితకు పీఎస్ గా పనిచేశారు. అలాగే అగ్రికల్చర్, సోషల్ వెల్ఫేర్, హౌసింగ్, అర్బన్ డెవలప్ మెంట్... ఇలా వివిధ శాఖల్లో పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.