యాప్నగరం

సీఎంకు రక్తంతో ఉత్తరం రాసిన బాలిక

ఓ బాలిక తన తల్లిని చంపిన నేరస్థులను శిక్షించాలని సీఎంకు రక్తంతో లేఖరాసింది.

TNN 7 Dec 2022, 1:09 pm
తన తల్లిని చంపిన హంతకులపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని భావించిన ఓ బాలిక ఏకంగా రక్తంతో సీఎంకు ఉత్తరం రాసిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. బులంద్షార్ పట్టణానికి చెందిన ఓ 15ఏళ్లబాలిక..తన తల్లి మగబిడ్డకు జన్మనివ్వలేదనే కోపంతో తన తండ్రి, అతని కుటుంబ సభ్యులు తల్లిని సజీవ దహనం చేశారని ఆమె ఉత్తరంలో పేర్కొంది. ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో (బాలికను రక్షించండి, బాలికను చదివించండి)అంటూ ప్రభుత్వాలు చెబుతుండగా ఓ మహిళ మగబిడ్డను కనలేదనే కోపంతో తగులబెట్టారని, ఇప్పటికీ తనను, తన సోదరిని చంపుతామని బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె సీఎంను కోరింది.
Samayam Telugu Letter With Blood


‘మా నాన్న బన్సాల్, ఇతర కుటుంబ సభ్యులు నన్ను మా చెల్లిని ఇంట్లో బంధించి మా అమ్మకు నిప్పు పెట్టారు’ అంటూ ఆ అమ్మాయి లేఖలో వివరించారు. అయితే తాను జూలైలోనే సీఎంకు లేఖ రాశానని దానికి ఇంతవరకు స్పందన రాలేదని, రక్తం రాస్తేనయినా సీఎం స్పందిస్తారనే ఆశతోనే ఈ ప్రయత్నం చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మొదటవ ఫేస్ బుక్ లో తన లేఖను అప్ లోడ్ చేసిన అమ్మాయి తర్వాత సీఎంకు పోస్ట్ చేసింది. అయితే మహిళ హత్య జరిగిన రోజే ఆమె భర్తను అరెస్టు చేశామని, ఆధారాలు లభిస్తే ఇతర కుటుంబ సభ్యులనూ అరెస్టు చేస్తామని జిల్లా పోలీసు అధికారి అనీస్ అన్సారీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.