యాప్నగరం

ఆ విద్యార్థినీలకు నీళ్లు తాగాలంటే భయం! ఎందుకో తెలుసా?

అనగనగా ఓ స్కూలు.. అందులో చదువుతున్న విద్యార్థినీలు అస్సలు నీళ్లు తాగరు. కనీసం అన్నం కూడా ముట్టరు. ఇదేదో వింతలా ఉందే అనుకుంటే పొరపాటే. అది వారు ఎదుర్కొంటున్న కష్టం.

TNN 19 Dec 2017, 4:13 pm
నగనగా ఓ స్కూలు.. అందులో చదువుతున్న విద్యార్థినీలు అస్సలు నీళ్లు తాగరు. కనీసం అన్నం కూడా ముట్టరు. ఇదేదో వింతలా ఉందే అనుకుంటే పొరపాటే. అది వారు ఎదుర్కొంటున్న కష్టం. ఆ విద్యార్థినీలు చదువుతున్న పాఠశాలలో కనీసం టాయిలెట్స్ కూడా లేకపోవడంతో.. వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలకు నిదర్శనం ఇది. ‘స్వచ్ఛ్ భారత్’ పేరుతో ఇంటింటా మరుగుదొడ్లు తప్పనిసరి అంటూ ప్రచారం చేస్తున్న మోదీ ప్రభుత్వం తలదించుకోవల్సిన విషయం ఇది. ఎందుకంటే.. ఆ పాఠశాల మరెక్కడో కాదు... సాక్షాత్తు బీజీపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనే.
Samayam Telugu girls in utter pradesh schools avoid drinking water and not having lunch in premises do you know why
ఆ విద్యార్థినీలకు నీళ్లు తాగాలంటే భయం! ఎందుకో తెలుసా?


చారిత్రత్మక నగరమైన ఆగ్రా సర్కిల్‌లో దాదాపు 500 పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు లేవు. మరో 800 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం కూడా లేదు. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల విద్యార్థినీలు నీళ్లు తాగడమే మానేశారు. కొంతమందైతే మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా భయపడుతున్నారు. ‘మెయిల్ టుడే’ కథనం ప్రకారం.. జుగ్నూ అనే నాలుగేళ్ల విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘స్కూల్లో పాఠశాలలు లేకపోవడం వల్ల ఇది వరకు యమునా నది ఒడ్డుకు వెళ్లేవాళ్లం. అక్కడ వరద రావడంతో భయమేసి వెళ్లడమే మానేశాం’’ అని తెలిపింది.

విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి అక్కడి పాఠశాల నిర్వాహకులకు, ప్రభుత్వ పెద్దలకు తెలిసినా... ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓ ప్రభుత్వ పాఠశాల ఇన్‌ఛార్జి రాజ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమస్యను బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు చాలా సార్లు విన్నవించుకున్నాం. కానీ, వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. విద్యార్థినీలే కాదు, ఉపాధ్యాయురాళ్లు సైతం ఈ సమస్య ఎదుర్కొంటున్నారు’’ అని తెలిపారు. బహుసా ఇది మనకు చిన్న సమస్యగానే కనిపించవచ్చు. కానీ, ఆ విద్యార్థినీలు మరుగుదొడ్లు లేక నరకయాతన అనుభవిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.