ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. దానికి దీటుగా చికిత్సా విధానాలపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే ఓ ఫార్మా సంస్థ కొత్త చికిత్సా విధానాన్ని రూపొందించడానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (ఐసీఎంఆర్) వద్ద అనుమతులు పొందింది. ఫావిపిరావిర్, యుమిఫెనోవిర్ అనే రెండు యాంటీవైరల్ మెడిసిన్లను కలిపి కరోనా కోసం కొత్త చికిత్సా విధానాన్ని రూపొందించాలని ఫార్మా సంస్థ గ్లెన్మార్క్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా తేలికపాటి కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన 158 మందికి ఈ విధానంలో చికిత్స అందించనున్నట్లు తెలుస్తోంది.
కరోనా రోగులకు ఈ విధానంలో చికిత్స తొలిదశలోనే చేస్తే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో వైరస్ లక్షణాలు ప్రారంభమైనప్పుడే ఈ ఔషధం అధికంగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే కరోనాను చాలావరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై గ్లెన్మార్క్ ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా మాట్లాడారు. వివిధ వైరస్లను సమర్థంగా నియంత్రించే యాంటీవైరల్ ఏజెంట్లను మిళితం చేసి రూపొందించే చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయి. శరీరంలోకి వైరస్ ప్రవేశించి తొలిదశలో ఉన్నప్పుడే ఈ విధానం మెరుగ్గా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Must Read: undefined
కరోనా రోగులకు ఈ విధానంలో చికిత్స తొలిదశలోనే చేస్తే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో వైరస్ లక్షణాలు ప్రారంభమైనప్పుడే ఈ ఔషధం అధికంగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తే కరోనాను చాలావరకు నియంత్రించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై గ్లెన్మార్క్ ఫార్మా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా మాట్లాడారు. వివిధ వైరస్లను సమర్థంగా నియంత్రించే యాంటీవైరల్ ఏజెంట్లను మిళితం చేసి రూపొందించే చికిత్సా విధానాలు ప్రభావవంతంగా ఉంటాయి. శరీరంలోకి వైరస్ ప్రవేశించి తొలిదశలో ఉన్నప్పుడే ఈ విధానం మెరుగ్గా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Must Read: undefined