కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ మహమ్మారి దాదాపు అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. చైనా, ఇటలీ, అమెరికా, స్పెయిన్ దేశాల్లో మరణ మృదంగం సృష్టిస్తోంది. అనేక మంది అమాయకులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ వ్యాప్తంగా కోరలు చాచిన కరోనా.. ఇప్పటివరకు 75,299 మందిని బలి తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 13,52, 287 మంది ఈ వైరస్ బారినపడ్డారు. 2,87, 699 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అత్యధికంగా ఇటలీలో 16,532 మంది ప్రాణాలు కోల్పోగా, స్పెయిన్లో 13,341 మంది, యూఎస్ఏలో 10,943 మంది, ఫ్రాన్స్లో 8,911, యూకేలో 5,373 మంది, ఇరాన్లో 3,739 మంది, జర్మనీలో 1,810 మంది, బెల్జియంలో 1,632, నెదర్లాండ్స్లో 1,867 మంది, టర్కీలో 649, స్విట్జర్లాండ్లో 765 మంది మృతి చెందారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 3,67,650, స్పెయిన్లో 1,36,675, ఇటలీలో 1,32,547, జర్మనీలో 1,03,375, ఫ్రాన్స్లో 98,010, ఇరాన్లో 60,500, యూకేలో 51,608, టర్కీలో 30,217, స్విట్జర్లాండ్లో 21,657, బెల్జియంలో 20,814 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో మొట్టమొదటిసారి మంగళవారం ఒక్కరు కూడా ఈ వైరస్తో మరణించలేదని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. జనవరి నుంచి మొదటిసారి మంగళవారం కరోనా వైరస్ తో ఎవరూ మరణించలేదని చైనా అధికారుల ప్రకటించారు.చైనా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చైనా వైద్యాధికారులు చెప్పారు. దేశీయంగా చైనాలో కరోనా కేసులు నమోదు కాకున్నా, విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రం కరోనా వస్తుందని చైనా అధికారులంటున్నారు.
మరోవైపు భారత్లో కరోనా కేసులు రోజరోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశం మూడు, నాలుగో దశలు నడుస్తున్నాయని ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడో దశలో కట్టడి చెయ్యలేకపోతే... నాలుగో దశకు చేరిందంటే... తీవ్ర పరిణామాలు తప్పవు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4800 దాటింది. అలాగే... మృతుల సంఖ్య 136గా ఉంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 704 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.
అత్యధికంగా ఇటలీలో 16,532 మంది ప్రాణాలు కోల్పోగా, స్పెయిన్లో 13,341 మంది, యూఎస్ఏలో 10,943 మంది, ఫ్రాన్స్లో 8,911, యూకేలో 5,373 మంది, ఇరాన్లో 3,739 మంది, జర్మనీలో 1,810 మంది, బెల్జియంలో 1,632, నెదర్లాండ్స్లో 1,867 మంది, టర్కీలో 649, స్విట్జర్లాండ్లో 765 మంది మృతి చెందారు. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 3,67,650, స్పెయిన్లో 1,36,675, ఇటలీలో 1,32,547, జర్మనీలో 1,03,375, ఫ్రాన్స్లో 98,010, ఇరాన్లో 60,500, యూకేలో 51,608, టర్కీలో 30,217, స్విట్జర్లాండ్లో 21,657, బెల్జియంలో 20,814 కేసులు నమోదు అయ్యాయి.
కరోనా వైరస్ పుట్టిన చైనా దేశంలో మొట్టమొదటిసారి మంగళవారం ఒక్కరు కూడా ఈ వైరస్తో మరణించలేదని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. జనవరి నుంచి మొదటిసారి మంగళవారం కరోనా వైరస్ తో ఎవరూ మరణించలేదని చైనా అధికారుల ప్రకటించారు.చైనా దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందని చైనా వైద్యాధికారులు చెప్పారు. దేశీయంగా చైనాలో కరోనా కేసులు నమోదు కాకున్నా, విదేశాల నుంచి వచ్చే వారికి మాత్రం కరోనా వస్తుందని చైనా అధికారులంటున్నారు.
మరోవైపు భారత్లో కరోనా కేసులు రోజరోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశం మూడు, నాలుగో దశలు నడుస్తున్నాయని ఇవి అత్యంత ప్రమాదకరమైనవని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మూడో దశలో కట్టడి చెయ్యలేకపోతే... నాలుగో దశకు చేరిందంటే... తీవ్ర పరిణామాలు తప్పవు. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4800 దాటింది. అలాగే... మృతుల సంఖ్య 136గా ఉంది. సోమవారం ఒక్క రోజే దేశంలో 704 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 500కు పైగా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.