యాప్నగరం

ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీ

Goa State Election Commission: గోవాలో మున్సిపల్ ఎన్నికలను ఏప్రిల్ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికలు 3 నెలలు వాయిదా వేశారు.

Samayam Telugu 25 Jan 2021, 4:20 pm
మున్సిపల్‌ ఎన్నికలను ఏప్రిల్ వరకు వాయిదా వేస్తూ గోవా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ గోవా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్‌ పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులంతా ఆ పనుల్లోనే నిమగ్నం అవుతారని, వారికి భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోవా ఎస్‌ఈసీ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జనవరి, ఫిబ్రవరితో పాటు మార్చి వరకు కొనసాగుతుందని.. అందువల్ల ఏప్రిల్‌ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జనవరి 18నే గెజిట్ విడుదల చేసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Polling


గోవాలో పనాజి కార్పొరేషన్‌ సహా 11 మున్సిపల్‌ కౌన్సిళ్లలో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో పాటు వివిధ గ్రామపంచాయతీల్లో ఉప ఎన్నికలు, దక్షిణ గోవాలోని నవేలిమ్‌ జిల్లా పంచాయతీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గోవా ఎస్‌ఈసీ చోఖా రామ్‌గార్గ్‌ నిర్ణయంతో ఇవన్నీ ఏప్రిల్ వరకు వాయిదాపడ్డాయి.

ఇటు ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంలో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనమని ఉద్యోగ సంఘాలు ప్రకటించడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఎస్‌ఈసీ మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని ఉద్యోగ సంఘాల ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఒక్క రోజు సీఎం, ఒకే ఒక్కడు సినిమాలా.. యువతికి భలే ఛాన్స్

Must Read: బస్సు డ్రైవర్‌ను కత్తితో పొడిచిన బైకర్.. దారివ్వలేదని!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.