యాప్నగరం

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి చిత్రం.. సుబ్రహ్మణ్య స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

లక్ష్మీ దేవిని ఐశ్వర్యానికి సంకేతంగా భావిస్తాం. దీంతో కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి చిత్రాన్ని ముద్రిస్తే అది భారత కరెన్సీ పరిస్థితిని మెరుగుపర్చొచ్చని బీజేపీ ఎంసీ సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డారు.

Samayam Telugu 15 Jan 2020, 8:53 pm
లక్ష్మీ దేవిని ఐశ్వర్యానికి, ధనానికి ప్రతిరూపంగా భావిస్తాం. సిరులు కురిపించే తల్లిగా పేరున్న లక్ష్మీ దేవిని మనం త్వరలోనే కరెన్సీ నోట్ల మీద చూడనున్నామా..? ఇదెంత వరకు సాధ్యమో తెలీదు కానీ.. కరెన్సీ నోట్లపై లక్ష్మీ దేవి చిత్రాన్ని ముద్రించడం తనకు సమ్మతమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఇలా చేయడం వల్ల భారత కరెన్సీ పరిస్థితి మెరుగు కావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో స్వామి వివేకానంద వ్యాఖ్యానమాల పేరిట చేసిన ప్రసంగాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామి ఈ వ్యాఖ్యలు చేశారని టెలిగ్రాఫ్ ఇండియా కథనాన్ని వెలువరించింది.
Samayam Telugu subramanian-swamy


ఇండోనేసియా కరెన్సీ మీద గణపతి చిత్రం ఉండే విషయమై ఒకరు సంధించిన ప్రశ్నకు సుబ్రహ్మణ్య స్వామి స్పందిస్తూ.. ప్రధాని మోదీ దీనికి సమాధానం ఇవ్వగలరన్నారు. దీనికి నేను అనుకూలమేనన్న ఆయన.. గణేషుడు విఘ్నాలను తొలగిస్తాడన్నారు. అంతే కాదు కరెన్సీ నోట్ల మీద లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచితే అది భారత కరెన్సీ పరిస్థితిని మెరుగుపరచొచ్చన్నారు. దీని గురించి ఎవరూ చెడుగా ఫీలవరన్నారు.

పౌరసత్వ సవరణ చట్టాన్ని కాంగ్రెస్, మహత్మా గాంధీ కోరుకున్నారన్న సుబ్రహ్మణ్య స్వామి.. 2003లో మన్మోహన్ సింగ్ కూడా పార్లమెంట్‌ను ఇదే కోరారన్నారు. పాకిస్థానీ ముస్లింలకు అన్యాయం చేస్తున్నామని.. ఇప్పుడు వారు దీన్ని అంగీకరించడం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం త్వరలోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) ని ప్రవేశపెడుతుందని స్వామి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.