యాప్నగరం

​భవన శిథిలాల్లో భారీ నిధి.. అందరూ షాక్ అయ్యారు!

అందులో ఏమన్నాయో తెరిచి చూడగా.. ఆశ్చర్యం కలిగించే రీతిలో భారీ నిధి బయటపడిందని

TNN 23 Jun 2017, 10:33 am
గత నెలలో అగ్ని ప్రమాదం సంభవించి చెన్నై టీ నగర్ లోని ‘చెన్నై శిల్క్స్’ భవనం ఒకటి శిథిలం కావడం తెలిసిన సంగతే. ఈ భారీ ఫైర్ యాక్సిడెంట్ లో ఆ భవనం మొత్తం నాశనం అయ్యింది. అందులోని కోట్ల రూపాయల విలువపై పట్టు చీరలు ఇతర పట్టు ఉత్పత్తులు కాలిపోయాయి. వస్త్రాలతో పాటు నగలు కూడా కాలిపోయాయని ప్రకటించారు. మొత్తం నష్టం విలువ కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా.
Samayam Telugu gold lockers found in chennai silks building
​భవన శిథిలాల్లో భారీ నిధి.. అందరూ షాక్ అయ్యారు!


కేవలం వస్త్రాలు,నగలే కాదు... అగ్ని ప్రమాదం ధాటికి ఆ భవనమే ఎందుకూ పనికి రాకుండా పోయింది. నగరం నడిబొడ్డున అలాంటి ప్రమాదం చోటు చేసుకోవడంతో.. ఆ శిథిలాలను తొలగించే బాధ్యత తీసుకున్న చెన్నై మున్సిపల్ అధికారులకు షాకిచ్చే సంఘటన చోటు చేసుకుంది. భవంతి శిథిలాలను తొలగించే పనిలో ఉన్న వారు రెండు భారీ లాకర్లను గుర్తించారు.

అంత ప్రమాదం జరిగినా అవి చెక్కు చెదరలేదు. అందులో ఏమన్నాయో తెరిచి చూడగా.. ఆశ్చర్యం కలిగించే రీతిలో భారీ నిధి బయటపడిందని సమాచారం. దాదాపు నాలుగువందల కిలోల బంగారం, రెండు వేల కిలోల వెండి ఆ లాకర్లలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఆ రహస్య లాకర్లలోని సొమ్ముల విలువ సుమారు రూ.120 కోట్ల పైనే అని అంచనా వేస్తున్నారు. ఆ లాకర్లను తమిళనాడు ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఆహుతి అయిన భవంతిలో ఇంత భారీ నిధి బయటపడటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించడం లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.