Madhya Pradesh: ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి.. మరో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం షాడోల్ వద్ద జరిగింది. సరుకు రవాణా రైలు పట్టాలు తప్పడంతో ఇద్దరు లోకోమోటివ్ పైలట్లతో సహా.. ఆరుగురు రైల్వే సిబ్బంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన కారణంగా.. బిలాస్పూర్-కట్నీ (Bilaspur-Katni) మార్గంలో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. బిలాస్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని సింగ్పూర్ స్టేషన్ సమీపంలో.. ఉదయం 6:50 గంటలకు సిగ్నల్ ఓవర్షూట్ అయ్యింది. ఈ కారణంగా రైలు ప్రమాదం జరిగిందని సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు చెప్పారు. దీంతో ఈ మార్గంలో నడిచే 10 రైళ్లను రద్దు చేసినట్లు ఆయన వివరించారు. ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన ఎనిమిది వ్యాగన్లు, ఒక ఇంజన్ పట్టాలు తప్పాయని చెప్పారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.