భారతీయ డ్యాన్సర్ శతజయంతి.. గూగుల్ డూడుల్ నివాళి
. భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణిగా, నృత్యదర్శకురాలిగా, గురువుగా విశేష సేవలు అందజేసిన ప్రముఖ నృత్య కళాకారణి మృణాళిని సారాభాయ్ 100 వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ డూడుల్
Samayam Telugu 11 May 2018, 10:35 am
పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ నృత్య కళాకారిణి మృణాళిని సారాభాయ్ 100 వ పుట్టిన రోజు సందర్భంగా గూగుల్ డూడుల్తో గౌరవించింది. భారతీయ సాంప్రదాయ నృత్యకళాకారిణిగా, నృత్యదర్శకురాలిగా, గురువుగా ఆమె విశేష సేవలు అందజేశారు. ‘దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ స్థాపించి, నృత్య రీతులు, నాటకాలు, సంగీతం, పప్పెట్రీలపై శిక్షణ ఇచ్చారు. కళా సేవలకు గాను అనేక పురస్కారాలను ఆమెను వరించాయి. అంతేకాదు 18,000 మంది శిష్యులకు భరతనాట్యం, కథాకలిలో శిక్షణనిచ్చారు.
మృణాళి సారాభాయ్ 1918 మే 11 న కేరళలో జన్మించారు. ఈమె తండ్రి కూడా ప్రముఖ సామాజిక కార్యకర్త అమ్ము స్వామినాథన్. బాల్యమంతా స్విడ్జర్లాండ్లో గడిచింది. అక్కడే ‘డాల్క్రోజ్’ పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమ నృత్య భంగిమలను చేర్చుకున్నారు. అనంతరం శాంతినికేతన్లో రవీంధ్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత అమెరికా వెళ్లి అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్లో శిక్షణ పొంది తర్వాత భారత్ చేరుకున్నారు. అనతరం దక్షిణాది సాంప్రదాయక నృత్యం భరతనాట్యంలో ‘మీనాక్షి సుందరంపిళ్లై’ వద్ద, కథాకళిలో ‘తకఘి కుంచు కురూప్’ వద్ద శిక్షణ పొందారు.
భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ను వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె మల్లికా సారభాయ్ కూడా నృత్య కాళాకారిణే. మృణాళిని సారాభాయ్ 1948 లో దర్పణ అనే సంస్థను స్థాపించింది. పారిస్లో ‘థియేటర్ నేషనల్ డి చైల్లోట్’లో ప్రదర్శన ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. అనేక నవలలు, కవితలు, నాటకాలు, కథలు పిల్లల కోసం రాశారు.
మృణాళి సారాభాయ్ 1918 మే 11 న కేరళలో జన్మించారు. ఈమె తండ్రి కూడా ప్రముఖ సామాజిక కార్యకర్త అమ్ము స్వామినాథన్. బాల్యమంతా స్విడ్జర్లాండ్లో గడిచింది. అక్కడే ‘డాల్క్రోజ్’ పాఠశాలలో మొదటి పాఠాలుగా పశ్చిమ నృత్య భంగిమలను చేర్చుకున్నారు. అనంతరం శాంతినికేతన్లో రవీంధ్రనాథ్ ఠాగూర్ మార్గదర్శకత్వంలో విద్యాభ్యాసం చేశారు. తర్వాత అమెరికా వెళ్లి అమెరికన్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్లో శిక్షణ పొంది తర్వాత భారత్ చేరుకున్నారు. అనతరం దక్షిణాది సాంప్రదాయక నృత్యం భరతనాట్యంలో ‘మీనాక్షి సుందరంపిళ్లై’ వద్ద, కథాకళిలో ‘తకఘి కుంచు కురూప్’ వద్ద శిక్షణ పొందారు.
భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రం సారాభాయ్ను వివాహం చేసుకున్నారు. వీరి కుమార్తె మల్లికా సారభాయ్ కూడా నృత్య కాళాకారిణే. మృణాళిని సారాభాయ్ 1948 లో దర్పణ అనే సంస్థను స్థాపించింది. పారిస్లో ‘థియేటర్ నేషనల్ డి చైల్లోట్’లో ప్రదర్శన ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. సుమారు మూడు వందలకు పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. అనేక నవలలు, కవితలు, నాటకాలు, కథలు పిల్లల కోసం రాశారు.