యాప్నగరం

రాహుల్ గాంధీ వచ్చిపోవడానికి ఇదేం పిక్నిక్ స్పాట్ కాదు: యోగి

ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న శిశు మరణాల ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలని...

TNN 19 Aug 2017, 6:09 pm
ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న శిశు మరణాల ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గోరఖ్‌పూర్ వచ్చారు. శిశు మరణాలకి నిలయంగా మారిన బీఆర్డీ మెడికల్ కాలేజీలో బాధిత కుటుంబాలని పరామర్శించిన రాహుల్ గాంధీ వారి నుంచి ఘటనకి సంబంధించిన వివరాలు అడిగితెలుసుకున్నారు.
Samayam Telugu gorakhpur not a picnic spot yogi adityanath to rahul gandhi
రాహుల్ గాంధీ వచ్చిపోవడానికి ఇదేం పిక్నిక్ స్పాట్ కాదు: యోగి


అయితే, రాహుల్ గాంధీ విజిట్ కన్నా ముందుగానే గోరఖ్‌పూర్‌లో 'స్వచ్ఛ్ ఉత్తర్ ప్రదేశ్, స్వస్త్ ఉత్తర్ ప్రదేశ్' క్యాంపెయిన్‌లో పాల్గొనేందుకు అక్కడికి చేరుకున్న ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్.. రాహుల్ గాంధీ పర్యటనని ఎద్దేవా చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ సందర్శించిపోవడానికి గోరఖ్‌పూర్ ఏమీ పిక్నిక్ స్పాట్ కాదు అంటూ రాహుల్ గాంధీకి చురకలు అంటించే ప్రయత్నం చేశారు.

ఢిల్లీలో కూర్చునే ఓ యువరాజు అని రాహుల్ గాంధీని పరోక్షంగా సంభోదిస్తూ.. స్వచ్ఛ్‌తా అభియాన్‌కి వున్న ప్రాధాన్యత ఏంటో తెలియని ఆయన గోరఖ్‌పూర్‌కి ఎందుకు వస్తున్నట్టో అర్థం కావడం లేదు అని విస్మయం వ్యక్తంచేశారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

బీఆర్డీ మెడికల్ కాలేజీలో శిశు మరణాలకి లిక్విడ్ ఆక్సీజన్ కొరతే కారణం అని వస్తున్న ఆరోపణలని మొదటి నుంచీ గట్టిగా ఖండిస్తూ వస్తున్న యోగి ఆదిత్యనాథ్.. ఇవాళ రాష్ట్రంలోని ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ ఈ దుస్థితికే చేరడానికి గతంలో అధికారంలో వున్న సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలే కారణం అని ఆరోపించారు. గత 12-15 ఏళ్లలో అధికార పార్టీలు తమ స్వప్రయోజనాల కోసం ప్రజా వ్యవస్థని అధ్వాన్న స్థితికి దిగజార్చాయని ఆదిత్యనాథ్ మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.