యాప్నగరం

గోరఖ్‌పూర్ ఘోరం: మరో 42 మంది చిన్నారుల మృతి

గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. బీఆర్డీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. గడిచిన 48 గంటల్లో మరో 42 మంది చిన్నారులు మృతి చెందారు.

TNN 30 Aug 2017, 1:07 pm
గోరఖ్‌పూర్‌ ఆసుపత్రిలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. బీఆర్డీ వైద్య కళాశాల ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. గడిచిన 48 గంటల్లో మరో 42 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది ఇతర కారణాలతో మరణించినట్లు బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ వెల్లడించారు.
Samayam Telugu gorakhpur tragedy continues 42 children die in 48 hours
గోరఖ్‌పూర్ ఘోరం: మరో 42 మంది చిన్నారుల మృతి


ఆగస్టు 27న చిన్నపిల్లల విభాగంలో 342 మంది పిల్లలు చికిత్స కోసం చేరగా.. వారిలో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న మరికొంత మంది చిన్నారులో చేరారు. మొత్తం 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. బుధవారం (ఆగస్టు 30) ఉదయం వరకు మరో 25 మంది పిల్లలు మృత్యువాతపడ్డారు.

ఆగస్టు 7 నుంచి 11 మధ్యలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ ఆసుపత్రిలో 60 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో అధికారులు ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. బీఆర్డీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లాను పోలీసులు కాన్పూర్‌లో అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.