యాప్నగరం

సైనికులకు సర్కారు దీపావళి కానుక!

సరిహద్దుల్లో దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ప్రభుత్వం దీపావళి కానుక అందజేసింది.

TNN 18 Oct 2017, 6:49 pm
టెలీకాం మంత్రిత్వ శాఖ సైనికులకు దీపావళి కానుక ప్రకటించింది. దూరంగా ఉంటున్న ఆత్మీయులతో ఎక్కువ సేపు మాట్లాడుకోవడానికి వీలుగా కాల్ ఛార్జీలను తగ్గించింది. కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు ఇది మా తరఫున దీపావళి బహుమానం అని టెలీకాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్ ద్వారా మాట్లాడానికి ఇప్పటి వరకూ సైనికులు నెలకు రూ. 500 చెల్లించే వారు. దీనికి అదనంగా నిమిషానికి రూ.5 చొప్పున కాల్ ఛార్జీలు చెల్లిస్తున్నారు.
Samayam Telugu government announces diwali gift for soldiers
సైనికులకు సర్కారు దీపావళి కానుక!


కానీ ప్రభుత్వం కాల్ ఛార్జీలను నిమిషానికి రూ. 5 నుంచి రూ. 1కి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి డిజిటల్ శాటిలైట్ ఫోన్ టెర్మినల్ కోసం వసూలు చేస్తున్న రూ. 500 ఛార్జీని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి నిమిషానికి ఒక్క రూపాయకే దూరంగా ఉన్న ఆత్మీయులతో మాట్లాడుకోవచ్చని మంత్రి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.