యాప్నగరం

నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్

నీతి ఆయోగ్‌కు కొత్త వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ నియమితులయ్యారు. అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేసి టీచింగ్‌లో కొనసాగనున్నట్టు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

TNN 6 Aug 2017, 9:35 am
నీతి ఆయోగ్‌కు కొత్త వైస్ చైర్మన్‌గా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ నియమితులయ్యారు. అరవింద్ పనగారియా తన పదవికి రాజీనామా చేసి టీచింగ్‌లో కొనసాగనున్నట్టు ప్రకటించిన ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఎయిమ్స్‌ చిన్నపిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ వినోద్ పాల్‌ను నీతి ఆయోగ్ సభ్యుడిగానూ నియమించారు. రాజీవ్ కుమార్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో డీఫిల్ పట్టా అందుకున్నారు. లఖ్‌నవూ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
Samayam Telugu government appoints rajiv kumar as the new vice chairman of niti aayog
నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా రాజీవ్ కుమార్


ప్రస్తుతం ఆయన సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్ (సీపీఆర్)లో సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఫిక్కికి సెక్రటరీ జనరల్‌గానూ పనిచేశారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్)కు డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2006 నుంచి 2008 వరకు జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ చీఫ్ ఎకనమిస్ట్‌గానూ విధులు నిర్వహించిన డాక్టర్ రాజీవ్ కుమార్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సీనియర్ అధికారిగానూ, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్‌లో పనిచేశారు. అనేక అంతర్జాతీయ, జాతీయ సంస్థల్లో బోర్డు సభ్యుడిగానూ బాధ్యతలు నిర్వహించిన రాజీవ్ కుమార్ రియాద్ ప్రభుత్వానికి చెందిన కింగ్ అబ్దుల్లా పెట్రోలియం స్టడీస్ అండ్ రిసెర్చ్ సభ్యుడిగా కొనసాగారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.