యాప్నగరం

New Cities: నానాటికీ పట్టణాలపై పెరుగుతోన్న భారం.. కొత్తగా 8 సిటీలు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్

New Cities: ఇప్పటికే దేశంలో నాలుగు వేలకుపైగా నగరాలు ఉన్నాయి. పట్టణాలకు జనం వలసలు పెరగడంతో భారం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త నగరాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోత్వరలో మరో ఎనిమిది నగరాలు పెరగనున్నాయి. దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఓ సీనియర్​ అధికారి తెలిపారు. నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు వీటిని అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 19 May 2023, 9:00 am

ప్రధానాంశాలు:

  • పట్టణాలపై పడుతోన్న అధిక జనాభా భారం
  • అర్బన్ 20 పేరుతో ఇండోర్‌లో కీలక సమావేశం
  • 26 నగరాల కోసం పలు రాష్ట్రాల నుంచి ప్రతిపాదన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Cities
పట్టణీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో రోజు రోజుకూ జనాభా భారం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నగరాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఓ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. పట్టణాలపై నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన వెల్లడించారు. మధ్యప్రదేశ్‌‌లోని ఇండోర్‌లో గురువారం ‘అర్బన్‌ 20’ సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్‌ డైరెక్టర్‌ ఎంబీ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని ఆయన తెలిపారు.
‘‘ఆర్థిక సంఘం సిఫార్సు తర్వాత.. పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి.. ఆ తర్వాత ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని ఎంబీ సింగ్‌ చెప్పారు. ప్రస్తుతం ఉన్న నగరాలు ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నందున కొత్త వాటిని నిర్మించాల్సిన అవసరాన్ని ఉటంకిస్తూ.. ‘ఇప్పటికే ఉన్న నగరాల శివార్లలో అస్తవ్యస్తంగా విస్తరించడం వల్ల ఈ నగరాల ప్రాథమిక ప్రణాళికను ప్రభావితం చేస్తోంది.. కొత్త నగరం అభివృద్ధి చెందితే సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు కనీసం 200 కి.మీ వ్యాసార్థంలో పెరుగుతాయి’ అని అన్నారు.

అయితే, కొత్త నగరాల ఏర్పాటుకు సంబంధించిన ఆర్థిక రోడ్‌మ్యాప్ ఇంకా ఖరారు కాలేదని, అయితే దేశంలోని పౌరుల కోసం కొత్తవాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నందున ఈ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తుందని సింగ్ అన్నారు.

గత నెలలో ప్రపంచం జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. జనాభా అధికంగా ఉన్న దేశాల్లో అగ్రస్థానంలో ఉన్న చైనాను అధిగమించింది. 142. 86 కోట్ల జనాభాతో చైనాను దాటి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అందుకు సంబంధించిన తాజా నివేదికను ఐరాస ఏప్రిల్ 18న విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారి మొదటి స్థానానికి చేరుకుంది.


Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.