యాప్నగరం

ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు ఇవే..!

ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆ వైరస్ సోకిన వారికి అలసట, ఒళ్లు నొప్పులు, జ్వరం, గొంతు నొప్పి ఉంటాయని కేంద్రం ప్రకటించింది. కాగా అన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.

Samayam Telugu 11 Jan 2022, 10:18 pm

ప్రధానాంశాలు:

  • జ్వరం, అలసట, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు
  • 24 గంటల్లో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదు
  • మహారాష్ట్రలో 1247 కేసులు రిజిస్టర్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వైరస్ లక్షణాలు
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వేగంగా నమోదవుతున్నాయి. అయితే ఈ వేరియంట్‌కు సంబంధించి మొదటి నుంచి వైద్య నిపుణులు వ్యాప్తి వేగంగా ఉంటుందని, తీవ్రత తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదే విధంగా గంటల వ్యవధిలోనే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ వేరియంట్‌ సోకితే లక్షణాలు స్వల్పంగానే ఉంటాయని కూడా వైద్య నిపుణులు తెలియజేశారు. అయితే ఈ లక్షణాలపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్‌ లక్షణాలకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. గొంతునొప్పి, అలసట, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటివి ఓమిక్రాన్ వేరియంట్ సాధారణ లక్షణాలుగా కేంద్రం పేర్కొంది. ఈ వేరియంట్ బారిన పడకుండా ఉండడానికి వ్యాక్సిన్ వేయించుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు తెలియజేసింది. ముఖ్యంగా మాస్క్‌లు పెట్టుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది.

లక్షణాలు తీవ్రంగా లేకపోయినా ఎక్కువ కేసులు నమోదైతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వేగంగా వ్యాప్తి చెందే ఈ వేరియంట్‌కు దూరంగా ఉండాలంటే కోవిడ్ ఆంక్షలను కచ్చితంగా పాటించాలి. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌తో రాజస్థాన్‌లో ఓ మరణం కూడా నమోదైంది. కాగా 24 గంటల్లో 4,461 ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహారాష్ట్రలో 1247 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 645, ఢిల్లీలో 546 నమోదయ్యాయి. కర్ణాటకలో 479 ఒమిక్రాన్ బాధితుల్లో 26 మంది కోలుకోగా.. కేరళలో 350 కేసుల్లో 140 మంది డిశ్చార్జ్ అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.