యాప్నగరం

శివసేన ఎంపీపై నిషేధం ఎత్తివేసిన ఎయిరిండియా

శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఇకపై అన్నీ విమానాల్లోనూ ప్రయాణం చేయొచ్చు.

TNN 7 Apr 2017, 4:25 pm
శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు ఉపశమనం లభించింది. ఆయన ఇకపై అన్నీ విమానాల్లోనూ ప్రయాణం చేయొచ్చు. అతనిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది. పౌర విమానయాన శాఖ ఎయిరిండియా నిషేధం ఎత్తివేయాలని కోరుతూ లేఖ రాసింది. ఆ లేఖ మేరకు ఎయిరిండియా నిర్ణయం తీసుకుంది. మార్చి 23న ఎయిరిండియాలోని పనిచేస్తున్న సీనియర్ మేనేజర్ ను ఎంపీ గైక్వాడ్ చెప్పుతో కొట్టిన విషయం తెలిసిందే. బిజినెస్ క్లాస్ టిక్కెట్ ఉన్న తనను, ఎకానమీ క్లాస్ కూర్చోబెట్టారంటూ... మేనేజర్ 25 సార్లు చెప్పుతో కొట్టాడు గైక్వాడ్. అనంతరం తాను కొట్టానంటూ ఒప్పుకున్నాడు. తమ సిబ్బంది పట్ల అమానుషంగా ప్రవర్తించిన అతనిపై దీంతో మొదట ఎయిరిండియా ఆయనపై నిషేధం విధించింది.
Samayam Telugu government orders air india to lift ban on ravindra gaikwad
శివసేన ఎంపీపై నిషేధం ఎత్తివేసిన ఎయిరిండియా


విమానయాన సంస్థల ఫెడరేషన్ కూడా నిషేధం విధించింది. అందులో సభ్యులుగా ఉన్న ఇండిగో, జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్ వంటి సంస్థలు కూడా ఆయన్ను తమ విమానం ఎక్కనివ్వలేదు. చాలా సార్లు ఆయన చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేశాయి. సూటిగా చెప్పాలంటూ ఆ ఎంపీకి విమానాయాన సంస్థలు చుక్కలు చూపించాయి. మార్చి 23 తరువాత ఏ విమానమూ ఆయన ఎక్కలేక పోయాడు. చివరికి గైక్వాడ్ తాను చేసిన పని పట్ల పశ్చాత్తాపం పడుతున్నట్టు కేంద్ర విమానయానమంత్రి అశోక్ గజపతి రాజుకు లేఖ రాశారు. ఆయన ఆదేశం మేరకు ఎయిరిండియా నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.