యాప్నగరం

ఆ శరణార్థులకు భారతీయ పౌరసత్వం

TNN 13 Sep 2017, 5:04 pm
దాదాపు ఐదు దశాబ్దాల కిందట బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్థాన్‌) నుంచి వలస వచ్చిన చక్మా, హజాంగ్‌ శరణార్థులకు భారత్ పౌరసత్వం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ అధికారి వెల్లడించారు. చక్మా, హజాంగ్‌ శరణార్థులకు పౌరసత్వం కల్పించాలని సుప్రీంకోర్టు 2015లో కేంద్రాన్ని ఆదేశించింది. బుధవారం ఏర్పాటుచేసి ఉన్నతస్థాయి సమావేశంలో చర్చించిన అధికారులు త్వరలోనే వారికి పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పెమా ఖండూ, హోంశాఖ సహాయ మంత్రి కిరన్‌ రిజిజు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ కూడా హాజరయ్యారు.
Samayam Telugu government to grant citizenship to chakmas hajong refugees
ఆ శరణార్థులకు భారతీయ పౌరసత్వం


ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ప్రాంతంలో నివసించిన చక్మా, హజాంగ్‌ జాతులు 60 వ దశకంలో వలస వచ్చారు. ఆ ప్రాంతంలో కప్తాయ్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టడంతో వీరంతా తమ నివాసాలను కోల్పోవాల్సి వచ్చింది. దీంతో బతుకుదెరువు కోసం భారత్‌‌లో ప్రవేశించిన వీరు అసోంలోని లుషాయ్‌ హిల్స్‌ జిల్లాకు చేరకున్నారు. అప్పట్లో 5 వేలుగా వీరి జనాభా ప్రస్తుతం లక్షకు చేరింది. వీరందరికి రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యాలు కల్పించింది. తూర్పు పాకిస్థాన్ నుంచి చక్మా శరణార్థులు బౌద్ధులు, హజాంగ్‌లు హిందువులు. కేవలం బతుదెరువు కోసమే కాదు, వీరిపై మతపరమైన దాడులకు పాల్పడటంతో వలస వచ్చారు.

షెడ్యూల్డ్ తెగల, దేశ ప్రజల హక్కులకు నష్టం వాటిళ్లకుండా వారికి పౌరసత్వం కల్పించాలని రెండేళ్ల కిందటే సుప్రీంకోర్టు ఆదేశించడంతో కేంద్రం చర్యలు చేపట్టింది. పౌరసత్వం కల్పిస్తే అనేక సమస్యల ఎదురవుతాయని అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భూ యాజమాన్య హక్కులు ఇవ్వకుండా పౌరసత్వం కల్పించాలని కేంద్రం యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.