యాప్నగరం

అమర జవాన్ల పిల్లల విద్యకు పూర్తిగా రాయితీ!

అమర జవాన్ల పిల్లల విద్య కోసం అయ్యే మొత్తం ఖర్చును ఇక కేంద్రమే భరించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రక్షణ శాఖ గురువారం విడుదల చేసింది.

TNN 22 Mar 2018, 3:17 pm
అమర జవాన్ల పిల్లల విద్య కోసం అయ్యే మొత్తం ఖర్చును ఇక కేంద్రమే భరించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను రక్షణ శాఖ గురువారం విడుదల చేసింది. గతంలో అమర జవాన్ల పిల్లల విద్యకు గరిష్టంగా నెలకు రూ.10,000 మాత్రమే చెల్లించేవారు. అయితే ఈ నిబంధనను సడలించినట్టు రక్షణ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. సాయుధ దళాలకు చెందిన అధికారులు పిల్లలకు, శత్రువులతో జరిగిన పోరాటంలో చనిపోయిన లేదా గాయపడిన కిందిస్థాయి సైనికుల పిల్లలకు ఈ రాయితీలు వర్తిస్తాయి. దాదాపు 3,400 మంది పిల్లలకు లబ్ది చేకూరే ఈ పథకానికి సుమారు రూ.5 కోట్ల ఖర్చువుతుంది. స్వయంప్రతిపత్తి లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వ సహాయంతో నడిచే విద్యా సంస్థలు, సైనిక లేదా మిలటరీ పాఠశాలలు, కళాశాలల్లో చేరిన వారికి మాత్రమే రాయితీలు వర్తిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Samayam Telugu martyrs


అమరులైన, యుద్ధంలో గాయపడిన సైనికుల పిల్లల విద్యకు అయ్యే ఖర్చుల నిబంధనలను సడలించాలని కోరుతూ గత డిసెంబరులో నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌లకు చెందిన చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ నుంచి వచ్చిన వినతలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ చిన్న సందేశం దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న జవాన్ల కుటుంబాల యోగక్షేమాలను చూసుకుంటామని, వారి త్యాగాలను నిజంగా ప్రభుత్వం గుర్తించిదనడానికి నిదర్శనమవుతుందని సీఓఎస్సీ ఛైర్మన్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అమర జవాన్లు పిల్లల విద్యకు అయ్యే ఖర్చులపై పరిమితి ఎత్తివేసి రక్షణ పట్ల తన నిబద్దతను దేశం చాటుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు దీనిపై లేఖ రాస్తూ.. దేశం కోసం త్యాగం చేసే వారి పిల్లలకు విద్యకు ఇచ్చే రాయితీలపై నిబంధనలు విధించడం అనైతికం, అభ్యంతరకరమని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.