అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేత ఎడప్పాడి పళనసామితో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు నిర్ణయించారు. సీఎంగా పళనిసామిని నియమిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పళనికి సూచించారు. గురువారం సాయంత్రం 4.30గంటలకు పళనిసామి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
124 మందిఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందించిన అనంతరం గవర్నర్ ఆయన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. అసెంబ్లీలో బలనిరూపణకు పళనిసామికి గవర్నర్ రెండు వారాలు గడువు ఇచ్చారు.
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లడంతో...ఆమె పళనిసామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యేలా చేసి వెళ్లారు. దీంతో డిసెంబర్ 5న అమ్మ మరణం తర్వాత మూడు నెలల కాలంలో తమిళనాడుకు ముగ్గురు ముఖ్యంత్రులు పనిచేసినట్లు అవుతుంది.
అమ్మ మరణంతో ఓ పన్నీరుసెల్వం సీఎం అయ్యారు. అయితే చిన్నమ్మ శశికళ ఆ పదవి కన్నేయడంతో ఓపీఎస్ రాజీనామా చేశారు. కానీ రెండు రోజులకే చిన్నమ్మపై తిరుగుబాటు చేశారు. ఆయయ వెంట 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని ఓపీఎస్ గవర్నర్ ను కోరినా..మెజార్టీ సభ్యుల బలం ఉన్న పళనికే గవర్నర్ అవకాశం ఇచ్చారు.
అయితే బలనిరూపణ సమయంలో ఎంత మంది పళనివెంట ఉంటారన్నది వేచి చూడాలి.
సీఎంగా ప్రమాణం స్వీకారం చేయడానికి గవర్నర్ ఆహ్వానించడంతో ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్ కు బయలుదేరారు.
చిన్నమ్మ వల్లే పళనికి సీఎం అయ్యే అవకాశం దక్కిందని ఆయన వర్గ నేతలు సంతోషంగా నినాదాలు చేస్తున్నారు. పదిరోజులుగా సంక్షోభం నెలకొన్న తమిళనాడులో గురువారం సాయంత్రానికి ముగియనుంది.
124 మందిఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్ కు అందించిన అనంతరం గవర్నర్ ఆయన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని సూచించారు. అసెంబ్లీలో బలనిరూపణకు పళనిసామికి గవర్నర్ రెండు వారాలు గడువు ఇచ్చారు.
అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లడంతో...ఆమె పళనిసామిని శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యేలా చేసి వెళ్లారు. దీంతో డిసెంబర్ 5న అమ్మ మరణం తర్వాత మూడు నెలల కాలంలో తమిళనాడుకు ముగ్గురు ముఖ్యంత్రులు పనిచేసినట్లు అవుతుంది.
అమ్మ మరణంతో ఓ పన్నీరుసెల్వం సీఎం అయ్యారు. అయితే చిన్నమ్మ శశికళ ఆ పదవి కన్నేయడంతో ఓపీఎస్ రాజీనామా చేశారు. కానీ రెండు రోజులకే చిన్నమ్మపై తిరుగుబాటు చేశారు. ఆయయ వెంట 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షకు తనకు అవకాశం ఇవ్వాలని ఓపీఎస్ గవర్నర్ ను కోరినా..మెజార్టీ సభ్యుల బలం ఉన్న పళనికే గవర్నర్ అవకాశం ఇచ్చారు.
అయితే బలనిరూపణ సమయంలో ఎంత మంది పళనివెంట ఉంటారన్నది వేచి చూడాలి.
సీఎంగా ప్రమాణం స్వీకారం చేయడానికి గవర్నర్ ఆహ్వానించడంతో ఎమ్మెల్యేలు బస చేసిన గోల్డెన్ బే రిసార్ట్స్ కు బయలుదేరారు.
చిన్నమ్మ వల్లే పళనికి సీఎం అయ్యే అవకాశం దక్కిందని ఆయన వర్గ నేతలు సంతోషంగా నినాదాలు చేస్తున్నారు. పదిరోజులుగా సంక్షోభం నెలకొన్న తమిళనాడులో గురువారం సాయంత్రానికి ముగియనుంది.