చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు. ఆయన శనివారం సాయంత్రం ముంబై నుంచి చెన్నై చేరుకున్నారు. జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కణ్నించి వెనుదిరిగారు. ఆసుపత్రి దగ్గర అభిమానుల తాకిడి అంతకంతకు పెరిగిపోతోంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తమ నాయకురాలు ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి బయటికి రావాలని అభిమానులు, పార్టీ కార్యకర్తలు హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. వారం క్రితం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన జయలలిత లండన్ డాక్టర్ రిచర్డ్ జాన్ బేలే పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. అన్నా డీళఎంకే అధికార ప్రతినిధి పి.రామచంద్రన్ మాట్లాడుతూ సీఎం ఆరోగ్యంగా ఉన్నారని, ఫోటోలు విడుదల చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
జయలలితకు ఇన్ఛార్జి గవర్నర్ పరామర్శ
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు పరామర్శించారు.
TNN 1 Oct 2016, 7:36 pm