యాప్నగరం

DAP Price: రైతులకు మోదీ గుడ్‌న్యూస్.. సగం ధరకే.. భారీగా సబ్సిడీ

కరోనా కష్టకాలంలో రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. భారీగా పెరిగిన ఎరువుల ధరల నుంచి ఉపశమనం కల్పించింది. కేంద్రం అందజేస్తున్న సబ్సిడీని భారీగా పెంచి డీఏపీ ధరను అందుబాటులోకి తెచ్చింది.

Samayam Telugu 19 May 2021, 11:14 pm
రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారీగా పెరిగిన ఎరువుల ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న సబ్సిడీని భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని కార్యాలయం తెలిపింది. గతంలో రూ.500గా ఉన్న సబ్సిడీని ఒక్కసారిగా రూ.1200కి పెంచుతూ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎరువులపై సబ్సిడీని 140 శాతం పెంచారు. కేంద్రం తాజా నిర్ణయంతో పాత ధరలకే డీఏపీ ఎరువులు రైతులకు అందుబాటులోకి రానున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
dap


అంతర్జాతీయ మార్కెట్ ఫాస్ఫారిక్ యాసిడ్, అమోనియా తదితర ముడి సరుకుల ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌లో డీఏపీ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో బస్తా డీఏపీ ధర రూ.1,700 ఉండేది. కేంద్రం సబ్సిడీ కింద రూ.500 చెల్లించడంతో రైతులకు రూ.1200కి అందుబాటులో ఉండేది. ఇటీవల ధరలు పెరగడంతో డీఏపీ బస్తా రూ.2400కి చేరింది. ప్రభుత్వ సబ్సిడీ పోను రూ.1900కి రైతులకు చేరుతోంది. కేంద్రం సబ్సిడీని 140 శాతం పెంచడంతో పాత ధరలకే డీఏపీ రైతులకు అందనుంది. పెంచిన సబ్సిడీ రూ.1200 కేంద్రం నేరుగా ఎరువుల కంపెనీలకు చెల్లించడంతో పాత ధర రూ.1200లకే డీఏపీ బస్తా రైతులకి లభించనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై అదనంగా రూ.14,775 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో తెలియజేసింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.