యాప్నగరం

నగదు విత్‌డ్రాలపై సర్‌చార్జి బాదుడు

ఈ నెలఖరు నుండి బ్యాంకులు, ఏటీఎంల నుండి నగదు విత్ డ్రాలపై సర్ చార్జి విధించే అవకాశం ఉంది

TNN 22 Dec 2016, 8:09 am
చేతిలో నగదు లేదా...డబ్బు బాగా అవసరం పడిందా.. జాగ్రత్త సుమీ... మీ నగదు విత్‌డ్రాయల్స్‌పై ప్రభుత్వం సర్‌చార్జి విధించనుంది. ఇకపై మీరు పరిమితికి మించిన నగదు విత్‌డ్రాలు చేస్తే ఆ మొత్తంపై సర్‌చార్జి విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదంతా దేశాన్ని నగదు రహిత ఆర్థిక లావాదేవీల దిశగా నడిపే లక్ష్యంలో భాగమేనని ప్రభుత్వం చెపుతోంది.
Samayam Telugu govt mulls surcharge on cash withdrawals
నగదు విత్‌డ్రాలపై సర్‌చార్జి బాదుడు


కొత్త ఏడాదిలో జనవరి మొదటి తేదీ నుండి లేదా ఈ నెలాఖరు నుండి ఈ నిబంధన అమల్లోకి వచ్చే చాన్సుంది. బ్యాంకు శాఖల నుండి రూ.50వేలు, ఏటీఎంల నుండి రూ.15వేలు తీసుకుంటే దానిపై 0.5శాతం నుండి 2శాతం వరకు సర్‌చార్జి వసూలు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకు ఇదమిద్దంగా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, దీని అమలు మాత్రం పక్కాయేనంటున్నాయి బ్యాంకింగ్ వర్గాలు. నల్లధనాన్ని అదుపు చేయాలంటే నగదు లావాదేవీలపై సర్‌చార్జీ విధించాలని గతంలో జస్టిస్ ఎం.బి.షా కమిటి సిఫారసు చేసింది. దానికి తోడు బ్యాంకుల వద్ద అవసరమైన స్థాయిలో నగదు నిల్వలు లేవు. మరోవైపు డిసెంబర్ నెలాఖరుతో నగదు విత్ డ్రాలపై పరిమితి ముగియనుంది. విత్ డ్రాలపై పరిమితిపై గడువు ముగిస్తే ప్రజలు మళ్లీ నగదు లావాదేవీలవైపునకు మళ్లే అవకాశం ఉంది. దీన్ని నివారించాలంటే షా కమిటి సిఫారసుల మేరకు సర్‌చార్జీ విధింపు ఒకటే మార్గంగా ప్రభుత్వం భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.