యాప్నగరం

Lockdown Extension in India: జులై 31 వరకు లాక్‌డౌన్.. కేంద్రం ప్రకటన, Unlock 2 మార్గదర్శకాలివే

Lockdown: కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 2.0కు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

Samayam Telugu 30 Jun 2020, 6:56 am
రోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్‌లాక్ 2.0కు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం (జులై 29) విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ జోన్లు కాకుండా ఇతర జోన్లలో పలు కార్యకలాపాలకు అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు జూలై 31 వరకు మూసివేయాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం కల్పించింది. హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకు అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్ములు, స్విమ్మింగ్‌పూల్స్‌పై నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Samayam Telugu అన్‌లాక్ 2
Unlock 2.0


రాత్రి 10 గంటల నుంచి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం కొనసాగుతుందని తెలిపింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నిషేధం కొనసాగుతున్న ఆయా అంశాలకు సంబంధించి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం (జులై 30) సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు పీఎంవో సోమవారం రాత్రి ట్వీట్ చేసింది.

Must Read: పాక్ అమ్మాయితో పెళ్లి కోసం ప్రధాని సాయం కోరిన పంజాబ్ యువకుడు

Also Read: వైద్యులకు వందనం.. జులై 1ని సెలవుదినంగా ప్రకటించిన సీఎం
Don't Miss: కరోనా పాజిటివ్ నేరం కాదు.. వైరస్‌ను జయించిన జర్నలిస్ట్ ఆవేదన, వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.