యాప్నగరం

ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతున్న యోగి

ప్రభుత్వ ఉద్యోగులకు సింహస్వప్నంలా మారారు యోగి ఆదిత్యనాథ్.

TNN 28 Apr 2017, 3:02 pm
ప్రభుత్వ ఉద్యోగులకు సింహస్వప్నంలా మారారు యోగి ఆదిత్యనాథ్. ఉద్యోగుల చేత పని చేయించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారాయన. ఆఫీసులో వాళ్లని పూర్తి సమయం ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారాయన. రాష్ట్రంలోని ప్రజలు బావుండాలంటే ప్రభుత్వోద్యోగులు, పోలీసులు సక్రమంగా పనిచేయాలని ఆయన చెప్పారు. అందుకే ఉద్యోగులంతా సక్రమంగా పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఇకపై ఆఫీసుకు సరిగా వస్తున్నారో లేదు తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తానని ప్రకటించారు. ఏ సమయంలోనైనా ప్రభుత్వ ఆఫీసులకు ఫోన్ చేస్తానని, ఉద్యోగులంతా ఉన్నారో లేదో తెలుసుకుంటానని చెప్పారు.
Samayam Telugu govt officers in up warned cm will call on landline too
ప్రభుత్వ ఉద్యోగుల భరతం పడుతున్న యోగి


ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటలలోపు ఎప్పుడైనా ఫోన్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సీనియర్ మంత్రి శ్రీకాంత్ శర్మ సీఎం తరపున హెచ్చరికలు జారీ చేశారు. కార్యాలయంలో ఉన్న ఏ ల్యాండ్ లైన్ కైనా సీఎం నుంచి ఫోన్ వస్తుందని... ప్రభుత్యోగులంతా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఫోన్ కు సమాధానం రాకపోతే చర్యలు తప్పవని తెలిపారు. అయితే ఈ హెచ్చరికలు కేవలం కార్యాలయాల్లో పనిచేసే వారికేనని, ఫీల్ట్ వర్క్ లో ఉండేవారికి వర్తించవని చెప్పారు. అవసరమైతే ఎంత సమయంమైనా పని చేయడానికి ప్రభుత్వం శాఖల్లో పనిచేసే ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని యోగి గతంలోనే తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.