యాప్నగరం

నాలుగేళ్లకోసారి కరెన్సీ నోట్ల మార్పు

ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రూ.2000, రూ.500నోట్లను కాపీ కొట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

Samayam Telugu 2 Apr 2017, 5:18 pm
ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన రూ.2000, రూ.500నోట్లను కాపీ కొట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కొత్త నోట్లు విడుదలైన కొన్ని రోజుల్లోనే దేశంలో నకిలీ నోట్లు బయటపడి కేంద్రప్రభుత్వంతోపాటు ఆర్బీఐని కలవరపాటుకు గురి చేసింది.
Samayam Telugu govt plans changing security features of banknotes every 3 4 years
నాలుగేళ్లకోసారి కరెన్సీ నోట్ల మార్పు


ఈ దొంగనోట్లకు స్థావరం పాకిస్థాన్ అని తేలింది. ఐఎస్ఐ అండతో ఆ దేశంలో తయారైన నకిలీ నోట్లు ఇండియా, బంగ్లాదేశ్ లలో చెలామణీ అవుతున్నట్లు తేలింది. కరెన్సీ నోట్లతో ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్చించేందుకు ఇటీవల ఆర్థికశాఖ, ఆర్బీఐ అధికారులు సమావేశమయ్యారు.

నకిలీ నోట్లను బెడదను అరికట్టేందుకు ప్రతి 3-4ఏళ్లకోసారి కొత్తనోట్ల భద్రతా ప్రమాణాల (సెక్యూరిటీ ఫీచర్స్)ను మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 3-4ఏళ్లకోసారి నోట్లపై ఉన్న భద్రతా ప్రమాణాలను మారుస్తూ ఉంటాయి. దీంతో నకిలీ నోట్లను అరికట్టవచ్చనేది దాని ప్రధాన ఉద్దేశ్యం. ఇదే విధానాన్ని భారత్ లోనూ అనుసరించాలని కేంద్రం యోచిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే దొంగనోట్లను అరికట్టాలంటే మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.