యాప్నగరం

పీఎఫ్ విత్‌డ్రాలపై వెనక్కు తగ్గిన కేంద్రం

వివాదాస్పదమైన పీఎఫ్ విత్‌డ్రాల కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది

TNN 20 Apr 2016, 7:31 am
వివాదాస్పదమైన పీఎఫ్ విత్‌డ్రాల కొత్త నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ప్రస్తుతానికి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పీఎఫ్ విత్‌డ్రాలపై నిబంధనలను కఠినతరం చేస్తూ కేంద్రం ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుండి దేశ వ్యాప్తంగా కార్మికులు, ఉద్యోగ సంఘాలవారు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చాలా చోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. బెంగలూరులో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా ఐదు లక్షల మంది ఆందోళన నిర్వహించగా అది హింసాయుతంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బలప్రయోగానికి కూడా సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలకు దిగాయి. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హుటాహుటిన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఎఫ్ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం పాత నిబంధనలే కొనసాగుతాయని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.