ప్రముఖ పర్యావరణవేత్త, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ పూర్ణిమా దేవీ బర్మన్ను ప్రతిష్టాత్మక ‘వైట్లీ అవార్డు’ వరించింది. పర్యావరణ విభాగంలో దీన్ని ‘గ్రీన్ ఆస్కార్’గా వ్యవహరిస్తారు. అసోం రాష్ట్రానికి చెందిన పూర్ణిమ గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. అసోంలో అరుదుగా కనిపించే.. అంతరించిపోతున్న తెగకు చెందిన ‘హార్గిలా’ అనే పక్షి జాతి సంరక్షణ కోసం ‘అరణ్యక్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పూర్ణిమ పని చేస్తున్నారు. కమ్రూప్ జిల్లాలోని కొన్ని గ్రామాలను తరచుగా సందర్శిస్తూ.. పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. దీని కోసం పోస్టర్లు, బ్యానర్లు వాడటమే కాకుండా వీధి నాటకాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
కర్ణాటక టైగర్ కారిడార్లో అడవుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మరో భారతీయుడు.. సంజయ్ గుబ్బీ కూడా గ్రీన్ ఆస్కార్కు ఎంపికయ్యారు. లండన్లోని ‘రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ’ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది 66 దేశాల నుంచి మొత్తం 166 మంది ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
Read this in Bengali
కర్ణాటక టైగర్ కారిడార్లో అడవుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న మరో భారతీయుడు.. సంజయ్ గుబ్బీ కూడా గ్రీన్ ఆస్కార్కు ఎంపికయ్యారు. లండన్లోని ‘రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ’ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది 66 దేశాల నుంచి మొత్తం 166 మంది ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
Read this in Bengali