యాప్నగరం

అఫ్ఘాన్‌లోని భారత రాయబారి నివాసంపై ‘ఉగ్ర’ దాడి

అఫ్ఘాన్‌లోని భారత రాయబారి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులకు దాడికి పాల్పడ్డారు. కాబూల్‌లోని భారతీయ దౌత్యవేత్త మన్ ప్రీత్ ఓహ్రా నివాసంపైకి ఉగ్రవాదులు రాకెట్‌ లాంచర్‌ను ప్రయోగించారు.

TNN 6 Jun 2017, 2:42 pm
అఫ్ఘాన్‌లోని భారత రాయబారి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులకు దాడికి పాల్పడ్డారు. కాబూల్‌లోని భారతీయ దౌత్యవేత్త మన్‌ప్రీత్ ఓహ్రా నివాసంపైకి ఉగ్రవాదులు రాకెట్‌ లాంచర్‌ను ప్రయోగించారు. ఈ రాకెట్ మన్‌ ప్రీత్ ఇంటి ఆవరణలోని టెన్నిస్ కోర్టులో పేలిపోయింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాబూల్‌లోని భారత రాయబారి కార్యాలయానికి భారీ భద్రత ఉంటుంది. దీని చుట్టు పక్కల వివిధ దేశాలకు చెందిన దౌత్య కార్యాలయాలు కూడా ఉన్నాయి. నాటో దళాలకు చెందిన హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
Samayam Telugu grenade attack on indian envoys residential compound in kabul
అఫ్ఘాన్‌లోని భారత రాయబారి నివాసంపై ‘ఉగ్ర’ దాడి


కాబూల్‌లో 'శాంతి, భద్రత సదస్సు' జరుగుతున్న సమయంలో తీవ్రవాదులు దాడికి తెగబడ్డారు. కాబూల్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు 27 దేశాలకు చెందిన ప్రతినిధులతోపాటు ఇతర అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు కూడా హాజరయ్యాయి. ఘటన గురించి తెలుసుకున్న భద్రతా దళాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. ఈ దాడికి పాల్పడిన వారి ఉగ్రవాదుల గురించి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.