యాప్నగరం

ఆహార ధాన్యాలపై పన్ను మినహాయింపు

ఆహార ధాన్యాలపై ఎలాంటి పన్ను విధించకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల ఆమోదించిన వస్తేసేవల పన్ను

Samayam Telugu 19 May 2017, 4:50 pm
ఆహార ధాన్యాలపై ఎలాంటి పన్ను విధించకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల ఆమోదించిన వస్తేసేవల పన్ను (జీఎస్టీ) ధరలు ఖరారయ్యాయి. ఇందులో పాలను పన్ను నుంచి పూర్తిగా మినహాయించారు. దీంతో పాల అమ్మకాల మీద ఇకమీదట ఎలాంటి పన్ను ఉండదు. దీంతోపాటు ఆహార ధాన్యాలు కూడా ధరలు తగ్గుతాయి. వీటి మీద ఇప్పటిదాకా 5 శాతం పన్ను కూడా రద్దయింది.
Samayam Telugu gst food grains exempted from levy small cars will face 28 percent tax
ఆహార ధాన్యాలపై పన్ను మినహాయింపు


పంచదార, టీ, కాఫీ, వంటనూనెల మీద 5% పన్ను పడనుంది. తలనూనెలు, సబ్బులు, టూత్‌పేస్టుల మీద ప్రస్తుతం 28% ఉన్న పన్ను జీఎస్టీతో 18%కు తగ్గనుంది.

మొత్తం 1,211 రకాల వస్తువుల మీద ఎంతెంత పన్ను విధించాలన్న విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించింది. 81% వస్తువులు 18% కంటే తక్కువ పన్ను పరిధిలోకే వస్తాయని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆది చెప్పారు. అలాగే చిన్న కార్లపై 28శాతం లేవీ మోపనుండగా.. లగ్జరీ కార్లపై 15శాతం పన్ను పడనుంది. ఏసీ, ఫ్రిజ్ లపై కూడా 28 శాతం పన్ను పడనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.