యాప్నగరం

నాలుగు శ్లాబుల్లో జీఎస్టీ పన్ను: అరుణ్ జైట్లీ

కొత్తగా అమలుకానున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నాలుగు శ్లాబుల్లో ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్

TNN 19 May 2017, 5:11 pm
కొత్తగా అమలుకానున్న వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నాలుగు శ్లాబుల్లో ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. వివిధ రంగాలపై 5, 12, 18, 28 శాతాల మేర జీఎస్టీ పన్ను విధింపు ఉంటుందని ఆయన శుక్రవారం శ్రీనగర్ లో తెలిపారు.
Samayam Telugu gst rates services to have 4 slabs says arun jaitely
నాలుగు శ్లాబుల్లో జీఎస్టీ పన్ను: అరుణ్ జైట్లీ


‘భారత్ నాలుగు రకాల పన్ను ధరలను విధించాలని నిర్ణయించింది. ఇందులో టెలికాం, బీమా, హోటళ్లు, రెస్టారెంట్లపై కొత్త పన్ను విధానం అమలుకానుంది. ఈ పన్ను విధానం జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది’ అని జైట్లీ వివరించారు.

టెలికాంతో పాటు ఇతర ఫైనాన్షియల్ సర్వీసులపై 18శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. రవాణాపై 5శాతం మేర పన్ను ఉంటుందని జైట్లీ చెప్పారు.
అయితే బంగారు కొనుగోలుపై ఎంతమేర పన్ను విధించాలనే అంశంపై జూన్ 3న జరిగే తదుపరి కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించనున్నారు.

కొత్త పన్ను శ్లాబులో ఫోన్ బిల్లు, హెయిర్ కటింగ్, రైలు, విమాన ప్రయాణాలపై 5శాతం పన్ను పడనుంది. నాన్-ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లపై 12శాతం పన్ను విధించగా ఎయిర్ కండీషన్డ్ రెస్టారెంట్లు 18శాతం, ఫైవ్ స్టార్ హోటళ్లపై 28శాతం పన్ను విధించనున్నారు. ఇదిలా ఉండగా, ఆహారధాన్యాలు, విద్య, ఆరోగ్యం వంటి రంగాలను పన్ను నుంచి పూర్తిగా మినహాయించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.