యాప్నగరం

కొనసాగుతున్న హైడ్రామా.. ఫలితాలు మరింత ఆలస్యం!

గుజరాత్‌లో రాజ్యసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా కొనసాగుతోంది. బ్యాలెట్‌ పేపర్‌ చూపించి ఓటు వేసిన..

TNN 8 Aug 2017, 9:10 pm
గుజరాత్‌లో రాజ్యసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపులో హైడ్రామా కొనసాగుతోంది. బ్యాలెట్‌ పేపర్‌ చూపించి ఓటు వేసిన ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ ... ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో.. కౌంటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నేతలతో ఎన్నికల అధికారుల చర్చిస్తున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నేతల సమక్షంలో పోలింగ్‌ ఫుటేజీని రిటర్నింగ్‌ అధికారి పరిశీలించారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని కాంగ్రెస్ కోరగా ఈసీ తిరస్కరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఆలస్యమవుతోంది.
Samayam Telugu gujarat counting yet to begin as bjp cong take fight to poll panel
కొనసాగుతున్న హైడ్రామా.. ఫలితాలు మరింత ఆలస్యం!


గుజరాత్‌ నుంచి 3 స్థానాలకు నలుగురు అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి అమిత్‌ షా, స్మృతి ఇరానీ, బల్వంత్‌ సిన్హా బరిలో నిలవగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి అహ్మద్‌ పటేల్‌ పోటీ చేశారు.

మూడు స్థానాలనూ కైవసం చేసుకొని భారీ విజయాన్ని నమోదు చేయాలని బీజేపీ భావిస్తుండగా.. అహ్మద్ పటేల్ విజయం కోసం కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డింది. మొదటి నుంచి ఎంత అప్రమత్తంగా వ్యవహరించినా.. కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. తమ ఎమ్మెల్యేలు జారీ పోకుండా బెంగళూరుకు తరలించడం, యూపీఏ మిత్రపక్షాల ఓట్లు అధికార పక్షానికి పడకుండా చూడటం తదితర చర్యలన్నీ విఫలమవడంతో సోనియాగాంధీ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన బల్వంత్‌ సిన్హా రాజ్‌పుత్‌, కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్‌ పటేల్‌ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

మంగళవారం (ఆగస్టు 8) నిర్వహించిన ఎన్నికల్లో.. గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం 182 మంది సభ్యులుండగా.. 176 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బీబీ సావిన్‌ తెలిపారు. విజయం దక్కాలంటే ఒక్కో అభ్యర్థికి 45 ఓట్లు అవసమైన నేపథ్యంలో బీజేపీ పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. గుజరాత్‌ అసెంబ్లీలో ఇద్దరు సభ్యులున్న ఎన్సీపీని కూడా చివరి నిమిషంలో తమవైపునకు తిప్పుకొని కాంగ్రెస్‌ను ఖంగు తినిపించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.