యాప్నగరం

ఆ 4 రాష్ట్రాల్లోనూ మాదే విజయం: అమిత్ షా

కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే ఘన విజయం దక్కిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రజలు తమ పార్టీపై విశ్వాసం ఉంచారని ఆయన అన్నారు.

TNN 18 Dec 2017, 7:11 pm
కోట్లాది మంది కార్యకర్తలు రేయింబవళ్లు శ్రమించడం వల్లే ఘన విజయం దక్కిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రజలు తమ పార్టీపై విశ్వాసం ఉంచారని ఆయన అన్నారు. గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం (డిసెంబర్ 18) ఆయన మీడియాతో మాట్లాడారు. తాజా విజయాన్ని కార్యకర్తల గెలుపుగా అభివర్ణించారు. తమ పార్టీని గెలిపించిన గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.
Samayam Telugu gujarat himachal pradesh voted for politics of performance over dynasty amit shah
ఆ 4 రాష్ట్రాల్లోనూ మాదే విజయం: అమిత్ షా


‘అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనకే ప్రజలు పట్టం కట్టారు. కులం కార్డుతో గెలవాలనుకున్న కాంగ్రెస్‌ను గుజరాత్ ఓటర్లు తిరస్కరించారు. హిమాచల్‌ ప్రదేశ్‌లో అవినీతిని ప్రజలు తిప్పికొట్టారు. కుల, వారసత్వ రాజకీయాలు చేసే పార్టీలకు ఈ ఎన్నికలు గుణపాఠం’ అని అమిత్ షా అన్నారు. 2019 సాధారణ ఎన్నికల్లోనూ తామే విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో తమకు హోరాహోరీ పోరు జరగలేదని, తాము పూర్తి ఆధిక్యం సాధించామని అమిత్ షా అన్నారు. తమకు ఓట్ల శాతం కూడా పెరిగిందని వెల్లడించారు. ‘ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వస్తున్నాం. నరేంద్ర మోదీ నాయకత్వంలో 19 రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకున్నాం. కర్ణాటకతో పాటు రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం’ అని ఆయన దీమా వ్యక్తం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.