యాప్నగరం

రెండో డోసు తీసుకున్నాక కరోనా పాజిటివ్..!

Gujarat: గుజరాత్‌లో ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత కరోనా పాటిజివ్‌గా తేలింది. ఈ ఘటనపై సైంటిస్టులు ఏమంటున్నారు?

Samayam Telugu 7 Mar 2021, 1:16 am
రోనా వైరస్‌ సోకకుండా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న తర్వాత ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ ఘటన గుజరాత్‌లో అలజడి రేపింది. బాధిత వ్యక్తి ఆరోగ్య శాఖ ఉద్యోగి కావడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Vaccine second Dose


గాంధీనగర్‌లోని దెహ్గాం తాలూకాకు చెందిన ఆరోగ్య శాఖ అధికారి జనవరి 16న కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. ఫిబ్రవరి 15న రెండో డోసు తీసుకున్నారు. ఆ త్వాత మూడు రోజులకే ఆ అధికారికి జ్వరం వచ్చింది. ఆయన నమూనాలను పరీక్షించగా.. కరోనా పాజిటివ్‌గా తేలింది.

సదరు ఉద్యోగిలో చాలా తక్కువ స్థాయిలో కరోనా లక్షణాలు కనిపించాయని గాంధీనగర్‌ చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎంహెచ్‌ సోలంకి తెలిపారు. సోమవారం నుంచి ఆయన విధుల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వివరించారు.

అయితే.. కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న తర్వాత 45 రోజులకు యాంటీబాడీస్‌ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ముఖానికి మాస్క్‌ను తప్పకుండా ధరించాలని చెప్పారు. మిగతా కరోనా మార్గదర్శకాలను కూడా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ మళ్లీ కరోనా సోకడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనిస్తున్నారు. గుజరాత్‌లో ఇప్పటివరకు 2,72,240 కరోనా కేసులు నమోదవగా.. 4,412 మంది మరణించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.