యాప్నగరం

గుజరాత్‌లో రెండో కరోనా మరణం..

కరోనా వైరస్ కారణంగా గుజరాత్‌లో 85 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కోవిడ్ బారిన పడి మరణించిన వారి సంఖ్య గుజరాత్‌లో రెండుకు చేరింది.

Samayam Telugu 25 Mar 2020, 11:54 pm
కరోనా వైరస్ బారిన పడి అహ్మదాబాద్‌లో 85 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిందని గుజరాత్ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇటీవలే ఆమె విదేశాలకు వెళ్లి వచ్చారని.. అనారోగ్యం కారణంగా మార్చి 22న సివిల్ హాస్పిటల్‌లో చేరారని తెలిపారు. ఆమె చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయన్నారు. ఇది గుజరాత్‌లో నమోదైన రెండో కరోనా మరణం కావడం గమనార్హం. మార్చి 22న 67 ఏళ్ల వ్యక్తి కరోనా కారణంగా సూరత్‌లో ప్రాణాలు కోల్పోయాడు.
Samayam Telugu corona death


కరోనా బారిన పడి బుధవారం మధ్యప్రదేశ్‌లోనూ 65 ఏళ్ల వృద్ధురాలు చనిపోయారు. తమిళనాడులోనూ 54 ఏళ్ల కోవిడ్ పేషెంట్ చనిపోయారు. ఈ రాష్ట్రాల్లో నమోదైన తొలి కరోనా మరణాలు ఇవి. కాగా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 12 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలారు. ముంబై, గుజరాత్‌ల్లో ఇద్దరు చనిపోగా.. కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, బెంగాల్‌లో ఒకరు చొప్పున మృతి చెందారు.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 607కు చేరగా.. తెలంగాణలో 41 మంది, ఏపీలో 10 మంది కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం తెలుగు రాష్ట్రాల్లో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మూడేళ్ల చిన్నారికి కరోనా సోకింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.