యాప్నగరం

గుజరాత్ వర్షాలు.. లోయలో పడిన బస్సు, 21 మంది మృతి

Gujarat: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Samayam Telugu 30 Sep 2019, 11:56 pm
స్సు లోయలో బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మంది గాయపడ్డారు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు.. అంబాజీ ప్రాంతంలో లోయలో పడిపోయింది. ప్రమాదంలో గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu bus


అంబాజీ-దంతా రహదారిలోని త్రిశూలియ ఘాట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బనస్కాంతకు 160 కి.మీ. దూరంలో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Don't Miss: ఎస్‌ఐని చంపబోయిన దొంగల ముఠా పోలీసులకు చిక్కిందిలా..

భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘాట్ రోడ్డులో బస్సు స్కిడ్ అవడం వల్లే లోయలో పడినట్లు చెబుతున్నారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలి భీతావహంగా మారింది.

Also Read: నిజామాబాద్‌లో యువతి కిడ్నాప్.. పొలం వద్ద ఉండగా, కారులో వచ్చి!

ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ మోదీ ట్వీట్ చేశారు. ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.