యాప్నగరం

గాంధీజీ ఆత్మహత్య చేసుకున్నారట.. పరీక్ష పేపర్ రూపొందించిన దేవుడెవరు?

Mahatma Gandhiని గాడ్సే కాల్చి చంపాడు కదూ. కానీ ఆయన ఎలా ఆత్మహత్య చేసుకున్నారో చెప్పండంటూ ఓ స్కూల్ విద్యార్థులను ప్రశ్నించింది. అదీ కూడాా గుజరాత్‌కు చెందిన పాఠశాల కావడం గమనార్హం.

Samayam Telugu 13 Oct 2019, 8:26 pm
జాతిపిత మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకున్నారా? లేదు కదూ. ఆయన్ను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడని స్కూలు పిల్లాడిని అడిగినా చెబుతాడు. కానీ గుజరాత్‌లో తొమ్మిదో తరగతి ఇంటర్నల్ పరీక్షలో.. గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారనే ప్రశ్న అడిగారు. గాంధీ పుట్టిన సొంత రాష్ట్రంలోని స్కూళ్లో ఈ తరహా ప్రశ్న ఎదురవడం విస్మయానికి గురి చేస్తోంది.
Samayam Telugu gandhi ji


‘సుఫలం శాల వికాస్ సంకుల్’ పేరిట నడిచే ఈ స్కూల్.. ప్రయివేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తోంది. కానీ ఈ బడికి ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నాయి.

ఇదొక్కటే ప్రశ్న కాదు.. పన్నెండో తరగతి విద్యార్థులు రాసిన పరీక్షలో.. చట్టవ్యతిరేకంగా మద్యం అమ్మకాలు పెరగడం వల్ల మీ ప్రాంతంలో కలుగుతున్న అసౌకర్యం గురించి మీ జిల్లా పోలీసు అధికారికి లేఖ రాయండంటూ మరో ప్రశ్నను సైతం సంధించారు.

ఈ ప్రశ్నల పట్ల విద్యాశాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని గాంధీనగర్ జిల్లా విద్యాశాఖాధికారి భరత్ వధేర్ మీడియాకు తెలిపారు. ఈ పరీక్ష పేపర్లను రూపొందించింది స్కూల్ యాజమాన్యం. దీనికి స్టేట్ బోర్డ్ డిపార్ట్‌మెంట్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.