యాప్నగరం

గుజరాత్‌లో మళ్లీ అధిక్యంలోకి కమలం

గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య విజయం దోబూచులాడుతోంది.

TNN 18 Dec 2017, 10:23 am
గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికల ఓట్ల లెక్కింపులో నిమిష నిమిషానికి ఫలితాలు తారుమారవుతున్నాయి. లెక్కింపు ప్రక్రియ తుది దశకు చేరేకొద్దీ బీజేపీ, కాంగ్రెస్‌ల విజయం ఊగిసలాడుతోంది. ఈ ఫలితాల సరళి దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు, ప్రజల్లో ఉత్కంఠను రేపుతోంది. కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. ఇంతలోనే మళ్లీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ 102 స్థానాల్లో ముందంజలో ఉండగా, కాంగ్రెస్ 79 స్థానాలకు పడిపోయింది. హిమాచల్‌ప్రదేశ్‌లోనూ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతోదంది. 68 స్థానాలున్న హిమాచల్ అసెంబ్లీలో బీజేపీ 39, కాంగ్రెస్ 25 చోట్ల ముందంజలో ఉన్నాయి.
Samayam Telugu gujrat elections 2017 bjp leads 102 congress 79
గుజరాత్‌లో మళ్లీ అధిక్యంలోకి కమలం


కాంగ్రెస్ ఆధిక్యం నెమ్మదిగా పెరుగుతూ ఉండటం, నిమిషానికోసారి ఫలితం మారుతుండటంతో కౌంటింగ్ కేంద్రాల వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఏ అభ్యర్థి కూడా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆనంద్ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉంది. తొలి రౌండ్‌లో వెనుకబడిన ఓబీసీ నేత జిగ్నేశ్, మూడో రౌండ్ తరువాత ఆధిక్యంలోకి రావడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.