యాప్నగరం

Hand Pump: నిప్పులు కక్కుతున్న నీళ్ల పంపు... భయాందోళనలో గ్రామస్థులు

మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ నీళ్ల పంపు (Hand Pump) నుంచి నీళ్లు కాకుండా నిప్పు వస్తుంది. నీళ్లతో పాటు నిప్పులు చిమ్ముతుంది. దాంతో గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఛతర్‌పూర్ జిల్లాలోని బక్స్‌వాహ పంచాయతీకి పది కిలోమీటర్ల దూరంలో కచ్చర్‌ గ్రామంలో ఇది జరిగింది. అయితే కొందరు గ్రామస్థులు దీనిని అద్భుతంగా భావిస్తున్నారు. కొందరు మాత్రం దీనికి ఏదో కారణం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. నిపుణులు కూడా దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంటున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 25 Aug 2022, 7:26 pm

ప్రధానాంశాలు:

  • మధ్యప్రదేశ్ గ్రామంలో అరుదైన ఘటన
  • నిప్పును చిమ్ముతున్న నీళ్ల పంపు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Hand Pump in MP
సాధారణంగా చేతి పంపు (బోరింగ్) (Hand Pump) నుంచి నీళ్లు వస్తాయి. అయితే ఓ పంపు నీళ్లు కాదు.. నిప్పును చిమ్ముతుంది. నీళ్ల పంపులు గ్రామాల్లో ఎక్కడబడితే అక్కడ కనిపిస్తుంటాయి. అందులో చేతితో కొడుతుంటే.. నీళ్లు వస్తుంటాయి. చాలా గ్రామాల ప్రజలు వాటి మీదే ఆధారపడుతుంటారు. నీటి అవసరాలను తీర్చుకునేందుకు వీటిని విరివిగా వాడుతుంటారు. అలాంటి నీళ్ల పంపు నుంచి మంటలు వస్తున్నాయి. దాంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఈ అరుదైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామంలో చోటుచేసుకుంటుంది.
కచ్చర్ గ్రామంలోని నీళ్ల పంపు నుంచి నీళ్లతో పాటు మంటలు వస్తున్నాయి. ఈ గ్రామం ఛతర్‌పూర్ జిల్లాలోని బక్స్‌వాహ పంచాయతీకి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అరుదైన సంఘటన గురించి స్థానికులు ఆ ప్రాంతంలోని అధికారులకు తెలియజేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియోను "మధ్యప్రదేశ్‌లోని బక్సవాహాలోని కచ్చర్ గ్రామంలో నీళ్ల పంపు నుంచి మంటలు, నీరు బయటకు వస్తున్నాయి." అనే క్యాప్షన్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


అయితీ దీనిపై గ్రామంలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదొక అద్భుతంగా కొందరు భావిస్తున్నారు.
మరికొందరు ఏదో రసాయన లీక్ వల్ల ఈ సంఘటన జరిగిందనుకుంటున్నారు. భూమిలోపల లోతు నుంచి అత్యంత మండే మీథేన్ వాయువు విడుదలవుతుందని, అందుకే ఇలా జరుగుతుందని కొందరు భావిస్తున్నారు.

దీనిపై భోపాల్‌లోని ప్రభుత్వ సైన్స్ కాలేజీకి చెందిన డాక్టర్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ శిలలలోని మొక్కలు, జంతువుల అవశేషాలు మీథేన్‌ను ఉత్పత్తి చేయడానికి చక్కటి ఇసుక ఉన్న చిత్తడి ప్రాంతంలో నిక్షిప్తమవుతాయని అన్నారు. రసాయన ప్రతిచర్య కారణంగా.. వేడి చేయడం లేదా కాల్చడం వల్ల గ్యాస్ తగ్గుతుంది. అది నీరు పెరగడానికి కూడా కారణమవుతుందని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.