యాప్నగరం

బీఫ్ తినేవాళ్లకు బహిరంగ ఉరిశిక్ష!

బీఫ్ తినేవాళ్లను బహిరంగంగా ఉరి తీయాలని విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి సరస్వతీ డిమాండ్ చేశారు.

Samayam Telugu 15 Jun 2017, 3:28 pm
బీఫ్ తినేవాళ్లను బహిరంగంగా ఉరి తీయాలని విశ్వహిందూ పరిషత్ నాయకురాలు సాధ్వి సరస్వతీ డిమాండ్ చేశారు. ఈ మేరకు చట్టాన్ని రూపొందించాలని ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. బుధవారం గోవాలో నిర్వహించిన ఓ సదస్సులో పాల్గొన్న సాధ్వి ఈ వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu hang those who eat beef vhp leader sadhvi saraswati
బీఫ్ తినేవాళ్లకు బహిరంగ ఉరిశిక్ష!


‘గోమాతకు హానీ చేసేవాళ్లు, దేశాన్ని అవమానించేవాళ్లంతా మనకు శత్రువులే. బీఫ్ తినేవాళ్లతో పాటు వాళ్లకు మద్దతుగా మాట్లాడేవాళ్లను బహిరంగంగా ఉరి తీయాలి’ అని సాధ్వి పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం చట్టం చేయాలని అన్నారు.

అంతేకాదు అందరు ఆవుపాలే తాగుతారని, పంది పాలు ఎవరూ తాగరని చెప్పిన ఆమె.. హిందూ సంప్రదాయాలను బతికించుకోవాలని పిలుపునిచ్చారు. మతం మార్చుకున్న హిందువులు తిరిగి మళ్లీ హిందువులుగా మారాలని ఆమె సూచించారు.
లవ్ జిహాద్ నుంచి ముస్లింలను కాపాడుకోవాలని సాధ్వి చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.