యాప్నగరం

హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

ఓవర్ స్పీడ్‌తో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన ట్రక్.. రోడ్డుపై బీభత్సం.. 13మంది మృతి.. 16మందికి తీవ్ర గాయాలు..

Samayam Telugu 4 Nov 2018, 7:49 pm
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోనిపట్ జిల్లాలో ట్రక్ బీభత్సం సృష్టించింది. ముండ్లానా సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ ట్రక్ రాంగ్ రూట్‌లో ఓవర్ స్పీడ్‌తో వచ్చింది. కారు, క్రూయిజర్ వాహనం, బైక్‌పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 13మంది చనిపోగా.. మరో 16మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఖానాపూర్ సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కూడా నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
Samayam Telugu Accident.


రోడ్డు ప్రమాదంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక అధికారులు.. ధ్వంసమైన వాహనాలను తొలగించారు. ట్రక్ బీభత్సంతో రోడ్లపై జనాలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.