యాప్నగరం

హ్యాట్సాఫ్ ఆరోగ్య మంత్రి.. వ్యాక్సిన్‌ ప్రయోగాలకు తొలి వాలంటీర్‌గా నమోదు

Covaxin: కరోనా వ్యాక్సిన్ కోసం దేశ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్న వేళ హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ బయోటెక్ కరోనా టీకా కొవాగ్జిన్ ప్రయోగాల కోసం తొలి వాలంటీర్‌గా నమోదు చేసుకున్నారు.

Samayam Telugu 18 Nov 2020, 6:04 pm
వివిధ దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్న వేళ.. భారతీయులు దేశీయ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించడానికి కృషి చేస్తున్న హైదరాబాద్ ఫార్మా దిగ్గజం ‘భారత్ బయోటెక్’ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సిద్ధమైంది. ఈ ప్రయోగాల కోసం హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలి వాలంటీర్‌గా నమోదు చేసుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
Samayam Telugu కొవాగ్జిన్ ట్రయల్స్
Haryana Health Minister Anil Vij register for Bharat Biotech Corona Vaccine Covaxin Third Phase Clinical Trials


భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ (Covaxin) మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్ నవంబరు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో 26 వేల మంది వాలంటీర్లతో మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి భారత్‌ బయోటెక్‌ ఏర్పాట్లు చేస్తోంది.



రోజుల తేడాతో రెండు ఇంజెక్షన్లు..
ట్రయల్స్‌లో భాగంగా వాలంటీర్లకు మొదట ఓ ఇంజెక్షన్ ఇస్తారు. అనంతరం కొన్ని రోజుల గ్యాప్‌తో మరో ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంట్రామస్కులర్‌ ఇంజెక్షన్లను 28 రోజుల తేడాతో ఇవ్వనున్నట్లు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా తెలిపారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో భారత్ బయోటెక్ ప్రయోగాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Bharat Biotech ఇప్పటికే తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో మూడో దశకు డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతులు ఇచ్చింది. ఐసీఎంఆర్‌ భాగస్వామ్యంతో భారత్ బయోటెక్ ఈ ప్రయోగాలు చేపట్టింది. కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశంలో చేపడుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌ ఇదే కావడం విశేషం.

మొదటి రెండు దశల ప్రయోగాల్లో (Clinical Trails) ఎలాంటి సమస్యలు రాలేదని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్లలో ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవని.. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని సంస్థ గతంలో తెలిపింది. మూడో దశ ట్రయల్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయని భావిస్తోంది. ప్రయోగాలు విజయవంతమైతే.. వెంటనే ప్రజలకు ఇవ్వడానికి తగిన చర్యల కోసం కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేపట్టింది.

Also Read: కొవాగ్జిన్ అందరికీ ఇవ్వడం కష్టం.. మరో టీకాపై ప్రయోగాలు

Must Read: తగ్గుతున్న కరోనా.. గొప్ప ఊరట

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.