యాప్నగరం

రైలు కింద పడినా బాలుడు బతికాడు.. ఇది ‘దేవుడి’ మాయే, వీడియో వైరల్

Haryana: గూడ్స్ రైలు మీద నుంచి వెళ్లినా రెండేళ్ల ఓ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. చిన్న గాయం కూడా లేకుండా.. లోకో పైలట్ సమయస్ఫూర్తితో దేవుడిలా రక్షించాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ అద్భుతం జరిగింది.

Samayam Telugu 25 Sep 2020, 8:19 pm
ద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు.. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. మహేశ్ బాబు ‘ఖలేజా’ సినిమాలో పాపులర్ డైలాగ్ ఇది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఇలాంటిదే ఓ అద్భుతం జరిగింది. రెండేళ్ల ఓ బాలుడిని 14 ఏళ్ల అతడి సోదరుడు రైలు పట్టాలపైకి తోసేశాడు. అప్పుడే అటు వైపుగా వేగంగా వస్తున్న గూడ్స్ రైలు ఇంజిన్ నుంచి లోకో పైలట్ ఆ దృశ్యాన్ని గమనించాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. రైలు భారీ శబ్దం చేస్తూ రైలు ఆగిపోయింది. కానీ, రైలింజన్ మాత్రం బాలుడి మీదుగా వెళ్లి నిలిచిపోయింది.
Samayam Telugu గూడ్స్ రైలు ఇంజన్ కింద బాలుడు
Miraculous escape for 2-year-old boy stuck under goods train engine


లోకో పైలట్లకు గుండె ఆగినంత పనైంది. వెంటనే వాళ్లు క్యాబిన్ నుంచి కిందకి దిగి బాలుడి వద్దకు పరుగెత్తుకొచ్చారు. ఆ బాలుడి కేకలు విన్నారు. బాలుడికి ఇంచు దూరంలో రైలు చక్రం నిలిచిపోయింది. అతడికి చిన్న గాయం కూడా కాలేదు. ఆ దృశ్యం చూశాక వారు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని పట్టాలపైకి తోసేసిన బాలుడిని పట్టుకొని గద్దించారు. ఆ తర్వాత చిన్నారిని అతడి తల్లికి అందజేశారు.

లోకో పైలట్ దీవాన్ సింగ్, అసిస్టెంట్ లోకో పైలట్ అతుల్ ఆనంద్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడని రైల్వే అధికారులు తెలిపారు. లోకో పైలట్లను అభినందించారు. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లా బల్లబ్‌గర్ రైల్వే స్టేషన్ సమీపంలో సెప్టెంబర్ 21న ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Don't Miss: జోక్ చేశాడు.. అదే నిజమైంది, రూ.12 కోట్ల జాక్‌పాట్

‘బ్రేకులు వేయడం క్షణం ఆలస్యమైనా ఆ బాలుడు ప్రాణాలతో బతికేవాడు కాదు. ఆ చిన్నారిని వాళ్లే కాపాడారు. సమయస్ఫూర్తితో వ్యవహరించారు’ అని ఆగ్రా డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీవాస్తవ అన్నారు. ఆ లోకో పైలట్లు ఇద్దరికీ అతి త్వరలో తగిన రివార్డు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

నువ్వే మా దేవుడివి అని నువ్వు నమ్మే పని లేదు.. మాకు నమ్మించే అక్కర లేదు.. సామీ ఇది నీ దర్శనం.. ఇదే నిదర్శనం...
ఈ వార్తా కథనం ఆరంభంలో చెప్పిన డైలాగ్ ముగింపు వాక్యాలివి. ఇప్పుడు ఇవే వాక్యాలు ఆ లోకో పైలట్‌కు కూడా సరిపోతాయి. తన బిడ్డను కాపాడిన లోకో పైలట్‌ను ఆ బాలుడి తల్లి జీవితాంతం దేవుడి రూపంగా గుర్తు పెట్టుకోవాలి. వీడియోను చూస్తే ఈ మాట నిజమేనని మీరూ ఒప్పుకుంటారు..

Also Read: సంగీత ప్రపంచం నిరుపేదదైంది.. ప్రధాని మోదీ భావోద్వేగం

Must Read: పిల్లల కోసం అన్నీ అమ్మకానికి పెట్టిన అమ్మ.. ‘గుండె’ను మెలిపెట్టే కష్టం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.