యాప్నగరం

పాఠశాలకు ప్రహరీ లేదని కోర్టుకు వెళ్లిన విద్యార్థులు

తాము చదువుకునే స్కూల్‌కు కాంపౌండ్ వాల్ లేదని హర్యానాలో ఐదుగురు విద్యార్థినులు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. స్కూల్ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ రిట్ దాఖలు చేశారు.

Samayam Telugu 26 Jul 2019, 7:19 pm
సాధారణంగా పాఠశాల విద్యార్థులు ఏం చేస్తారు? స్కూల్‌లో శ్రద్ధగా పాఠాలు విని, రోజూ హోం విధిగా వర్క్ చేస్తుంటారు. వారి వయసుకు సామాజిక అవగాహన తక్కువగానే ఉంటుంది. కానీ, హర్యానాలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థినులు తమ స్కూల్లో సౌకర్యాలు సరిగా లేవంటూ ఏకంగా కోర్టు మెట్లెక్కారు. ఈ ఘటన హర్యానాలోని మానేసర్‌లో చోటు చేసుకుంది.
Samayam Telugu high court haryana


మానేసర్‌లో ప్రభుత్వ బాలికల పాఠశాలలో 1 నుంచి 10 తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే అక్కడి ప్రధాన సమస్య ఆ పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం. దీంతో పాఠశాల ఆవరణను చదువుకు సంబంధించిన విషయాలకు కాకుండా ఇతర కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. స్కూల్ గ్రౌండ్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది.

ఇది గమనించిన విద్యార్థినులు విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. తమ స్కూల్‌లో సౌకర్యాలు సరిగా లేవు, అసాంఘిక శక్తులతో తాము చాలా అభద్రతకు గురవుతున్నామంటూ ఏకంగా హర్యానా పంజాబ్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. స్కూల్ ప్రమాణాలకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోవాలని కోరారు. రిట్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆగస్టు 2 లోగా ప్రభుత్వం స్పందించాలని నోటీసు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.