యాప్నగరం

ఇక ఆఫీసుల్లోనే మద్యం తాగొచ్చు.. కార్పోరేట్ ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్!

Haryna: హర్యానా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మద్యం పాలసీ మందుబాబులకు వరంగా మారింది. రోజంతా ఆఫీసుల్లో కష్టపడి పనిచేసేవారికి శుభవార్తను అందించింది. ఆఫీస్ వేళల్లో లిక్కర్‌ తాగేందుకు అవకాశం కల్పించింది. ఇక ఈ కొత్త విధానంతో ఆఫీస్‌ అయిపోయాక.. బార్లు, పబ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ, కాఫీ తాగినంత సులువుగా.. బీర్, వైన్ తాగొచ్చు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 14 May 2023, 6:52 pm

ప్రధానాంశాలు:

  • కొత్త మద్యం పాలసీ విడుదల చేసిన హర్యానా ప్రభుత్వం
  • కార్పొరేట్ ఆఫీసుల్లోనే మద్యం సేవించేలా అనుమతులు
  • బీర్లు, వైన్, తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు సేవించవచ్చని వెల్లడి

హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Haryna Govt Liquor Policy
హర్యానా లిక్కర్ పాలసీ
Haryna Liquor Policy: ఉదయాన్నే లేవడం, ఆఫీసుకు వెళ్లడం, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం. కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పుడు ఇదే తంతు నడుస్తోంది. మధ్య మధ్యలో టీ, కాఫీ, ఫ్రూట్ జ్యూస్‌లు తాగుతూ కుర్చీల్లో నుంచి లేవకుండా కూర్చునే వారికి హర్యానా సర్కార్ తీపి కబురు అందించింది. ఇక ఆఫీసుల్లోనే మద్యం సేవించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు 2023 - 2024 మద్యం పాలసీలో మార్పులు తీసుకువచ్చింది. ఈ నిర్ణయానికి మే 9న హర్యానా మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

వీటికి మాత్రమే అనుమతి
ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కదా అని ఎంత పడితే అంత తాగడానికి వీల్లేదు. తక్కువ ఆల్కహాల్ ఉండే మద్యాన్ని మాత్రమే తాగాలని షరతు విధించింది. ఆల్కహాల్ తక్కువగా ఉండే బీర్లు, వైన్లు, మరికొన్ని పానీయాలను పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల్లోకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తోటి ఉద్యోగులతో కలిసి మద్యం సేవించవచ్చని చెప్పింది. 5 వేల మందికిపైగా ఉద్యోగులు ఉండి... లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఆఫీసులకు మాత్రమే.. ఇది వర్తిస్తుందని తెలిపింది.

లైసెన్స్ ఫీజు
జూన్‌ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని హర్యానా సర్కార్ తెలిపింది. ఈ అనుమతి కోసం కార్పొరేట్‌ సంస్థలకు ఎల్-10 ఎఫ్ (L-10F) అనే ప్రత్యేక లైసెన్స్‌ను జారీ చేయనుంది. ఈ లైసెన్స్‌ పొందాలంటే కార్పొరేట్ సంస్థలు ఏడాదికి రూ. 10 లక్షలు చెల్లించాలని పాలసీలో పేర్కొంది. దీనితోపాటు మరో రూ. 3 లక్షలు సెక్యూరిటీ మొత్తంగా చెల్లించాలని తెలిపింది. కలెక్టర్‌, ఎక్సైజ్‌, ఐటీ కమిషనర్ల అనుమతితో లైసెన్స్‌ మంజూరు చేస్తారని చెప్పింది.
Read More Latest National News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.