యాప్నగరం

అప్పుడే అఖిలేష్ ఓటమి అంగీకరించాడా?

ఫ్యామిలీలో నెలకొన్న విబేధాలతో అఖిలేష్ ను ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది.

TNN 9 Mar 2017, 4:02 pm
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో జరుగుతున్న పోలింగ్ బుధవారంతో ముగుస్తోంది. హోరాహోరీగా జరిగిన ప్రచారంలో బీజేపీ, ఎస్పీ-కాంగ్రెస్ కూటమి, బీఎస్పీల మధ్య త్రికోణపు పోటీ నెలకొంది. 403 అసెంబ్లీ స్థానాలున్న అసెంబ్లీలో 202 స్థానాలు ఎవరి ఖాతాలో పడితే వారే విజేతలు.
Samayam Telugu has akhilesh accepted defeat in up poll before results
అప్పుడే అఖిలేష్ ఓటమి అంగీకరించాడా?


ఫ్యామిలీలో నెలకొన్న విబేధాలతో అఖిలేష్ కు ఓటమి భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది. యువ సీఎంగా పలు అభివృద్ధి పథకాలు అమలు చేసినా..ఆయన్ను ‘మోదీ ఫోబియా’ భయపెడుతోంది.

ఎన్నికల ప్రచారం ముగిశాక..సీఎం అఖిలేష్ యాదవ్ ఆయన భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో ముచ్చటించారు.

ఎన్నికల ప్రచార శైలి, ఫలితాలపై అఖిలేష్ మాట్లాడుతూ..‘‘ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ ఉండకపోయి ఉంటే మా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ముందు బీజేపీ పేరుకు లేకుండా పోయేది’’ అని అన్నారు.

ప్రచారంలో కేంద్రమంత్రులు ఎంత ప్రచారం చేసినా సైకిలును కదిలించలేరని చెప్పిన అఖిలేష్...చేయాల్సిదంతా చేశాం..ఇక ఫలితాలు మన చేతుల్లో లేవు అన్నట్లు మాట్లాడారు.

సైకిలు గుర్తు ఈసీ కేటాయించకపోవడం (తండ్రి ములాయం సింగ్ తో వచ్చిన విబేధాల వల్ల), కాంగ్రెస్ తో చివరికి దాకా పొత్తులు కొలిక్కి రాకపోవడంతో...డింపుల్ యాదవ్ లాంటి వారిని ప్రచారంలో దించాల్సి వచ్చిందని అఖిలేష్ అంగీకరించారు.

తాను ప్రచారం నిర్వహించని చోట డింపుల్ ఓటర్లను కలిశారని ఆయన చెప్పారు.

‘‘మీరు మీ ప్రణాళిక ప్రకారం పనులు చేయవచ్చు కానీ పరిస్థితులు (ఫలితాలు) మన చేతుల్లో ఉండవు’’ అని అఖిలేష్ అభిప్రాయపడ్డారు.

మార్చి 11న యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.