యాప్నగరం

మోదీని దించేందుకు పాక్‌తో కలిసి కాంగ్రెస్ ‘మహా కూటమి’: అమిత్ షా

మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌తో కలిసి ‘మహా కూటమి’ ఏర్పాటు చేస్తోందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలు.

Samayam Telugu 22 Sep 2018, 11:34 pm
రాఫెల్ ఒప్పందం.. అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అగ్గి రాజేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వేడి పుట్టిస్తున్నారు. రాఫెల్ ఒప్పందంపై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలెండ్ వ్యాఖ్యల తర్వాత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో, బీజేపీ నేతలు రాహుల్‌పై మండిపడుతున్నారు.
Samayam Telugu 58de26f6-f843-4485-a5f5-7ddc5d2054f4_1489297576


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ.. మోదీ హటావో అంటున్నారు. పాకిస్తాన్ కూడా ‘మోదీ హటావో’ అంటోంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తోంది. మోదీపై ఆధారాలు లేని ఆరోపణలు చేస్తోంది. ప్రదాని మోదీని గద్దె దించేందుకు కాంగ్రెస్ పార్టీ ‘అంతర్జాతీయ మహాకూటమి’ ఏర్పాటు చేస్తుందా?’’ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా #NaPakNaCongress అనే హ్యాష్‌ట్యాగ్ కూడా పోస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.